నవరత్నాలు ప్లస్ V/s ఆరు గ్యారెంటీలు

Publish Date:Apr 27, 2024

Advertisement

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే 
1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు. 
2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు. 
పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.  

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది.
- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఈ జూన్ 4న జగన్మోహన్‌రెడ్డి ప్రజల చేతిలో పెద్ద షాక్ తినబోతున్నారు. జగన్ ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోబోతున్నారు. ఆ గుణపాఠం కూడా అత్యంత దారుణంగా వుండబోతోంది అని ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పారు.
కోడి క‌త్తి డ్రామా ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ‌వ్యాప్తంగా ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికి సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఈ ఘ‌ట‌న కూడా ఒక‌టి.
ఈసారి ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప‌ది మంది మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల ఆరుగురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు, మ‌రో ఇద్ద‌రు బంధువులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు  వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా జగన్ గెలుపు - జగన్ ఓటమి పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది.
ఆడపడుచులందరూ కలసి మూకుమ్మడిగా వెళ్ళి చీరలు పంచిన వైసీపీ నాయకుడి ఇంటిలోకి విసిరేసి ఎంచక్కా వచ్చేశారు. మహిళలను ఆపడానికి ప్రయత్నించిన సదరు వైసీపీ నాయకుడి ముఖం మీద చీరల వర్షం కురిసింది.
పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి.
ఎన్నికల విధులు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణంలో అందరి దృష్టీ పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కూటమి బ లపరిచిన అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు.
తమ నాయకుడు తనకు కాకుండా మరొకరికి ప్రాధాన్యం ఇచ్చాడన్న కోపంతో రోడ్డు మీదే గొడవపడి, తిట్టుకున్న సంఘటన గుడివాడ నియోజకవర్గంలో జరిగింది.
తిరుపతి విమానాశ్రయం పక్కనే వున్న 50 ఎకరాల ఏపీఐఐసీ భూమిని మంత్రి అమరనాథ్ రియల్‌ఎస్టేట్ పరం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.