వెయ్యేళ్లనాటి అలంపూరు నందికి జాతీయ గుర్తింపు

Publish Date:Nov 28, 2024

Advertisement

 పురావస్తు పరిశోధకుడు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

 జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూరు పట్టణంలోని స్థానిక పురావస్తు ప్రదర్శన శాలలో గల అరుదైన నంది శిల్పం జాతీయ స్థాయి గుర్తింపుకు నోచుకొందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఢల్లీ లోని ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ భారతీయ ఇతిహాసం, చరిత్రలో నంది శిల్పం అన్న అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సులో  గురువారం నాడు ఆయన   అలంపురం మ్యూజియంలోని, ఉమామహేశ్వర శిల్ప ఫలకంతో, క్రీ.శ.11వ శతాబ్దినాటి, కందూరు చోళుల కాలానికి చెందిన, నల్ల శానపురాతిలో నగీషీగా చెక్కబడిన నంది శిల్పంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు.

ఇలాంటి శిల్పం భారతదేశంలోని మరే ప్రాంతంలోనూ వెలుగు చూడలేదని, అరుదైన ఈ శిల్పం, కళావిమర్శకులు, చరిత్రకారుల దృష్టికి తెచ్చినందుకు కర్నాటక చిత్రకళాపరిషత్‌కు చెందిన ఆచార్య రాఘవేంద్ర కులకర్ణి ఇంకా హాజరైన చరిత్రకారులు శివనాగిరెడ్డిని అభినందించారు. సదస్సు ముగింపు సభలో నిర్వాహకులు ఆయనను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఈ అరుదైన శిల్పాన్ని చూడటానికి త్వరలో అలంపూర్‌ సందర్శించటానికి ఆసక్తి చూపుతున్నారని శివనాగిరెడ్డి చెప్పారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.