తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికైనా... తెలుగు మీడియా అంటే చులక భావం... మీడియా సమావేశాల్లో తెలుగు జర్నలిస్టులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు... నీకేం తెలుసంటూ గద్దిస్తారు... తెలంగాణ కేసీఆర్ అయితే కొట్టడం ఒక్కటే తక్కువన్నట్లుగా మాట్లాడతారు... కేసీఆర్ గద్దింపు, బెదిరింపులతో జర్నలిస్టులంతా మౌనవ్రతం పాటిస్తారు... ఏ ప్రెస్ మీట్ లో చూసినా ఇదే ధోరణి కనిపిస్తుంది... అదే నేషనల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాత్రం గమ్మున సమాధానమిస్తారు... ఎంత ఇబ్బంది కలిగించే ప్రశ్న అడిగినా సార్ సార్ అంటూ గౌరవిస్తూ మాట్లాడతారు. అదే, తెలుగు జర్నలిస్టుల మీద అయితే అమాంతం విరుచుకుపడతారు. బెదిరిస్తారు... గద్దిస్తారు. దాంతో, కేసీఆర్ ను ప్రశ్నించడానికి తెలుగు జర్నలిస్టులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక, తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, తప్పు జరిగినా, కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అయితే, నేషనల్ మీడియా అలా కాదు. ఇష్యూ ఏదైనా ఏకిపారేస్తాయి.
ఇక, దిశ రేప్ అండ్ మర్డర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎంపీల తీరును జాతీయ మీడియా ఎండగట్టింది. కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించింది. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలను ఎండగట్టింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తీరును కూడా ప్రశ్నించింది. ఇలా, తెలంగాణ ప్రభుత్వ తీరును, సీఎంను, మంత్రులను ఏకిపారేసిన నేషనల్ మీడియా... ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ను చుట్టుముట్టింది. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ప్రశ్నించి నిలదీసింది. అయితే, మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కేసీఆర్ వెళ్లిపోయారు. అలా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడాన్ని కూడా జాతీయ మీడియా ఏకిపారేసింది. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే... ఆ కుటుంబాన్ని పరామర్శించని కేసీఆర్.... ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం మాత్రం ఢిల్లీ వచ్చారంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేశాయి. దాంతో, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురు కావడంతో సీఎంతోపాటున్న టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/national-media-targets-cm-kcr-39-91882.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు