ఒక్క రోజులోనే దేశంలో 6 హెచ్ఎంపీవీ కేసులు.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం!

Publish Date:Jan 7, 2025

Advertisement

హ్యూమన్‌ మెటానిమో వైరస్‌.. హెచ్ఎంపీవీ వ్యాప్తి వేగం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకూ ఎవరూ చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఉద్ధృతిపై వార్తలు వస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సోమవారం (జనవరి 6) ఒక్క రోజే భారత్ లో ఆరు కేసులు వెలుగు చూడటంతో అందరిలో ఆందోళన మొదలైంది. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు దేశాన్ని గడగడలాడిస్తోంది. మరో సారి కరోనా నాటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదన్న భయం అందరినీ వణికించేస్తోంది.  కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీలలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో జనం భయంతో వణుకుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేం కాదనీ, ఇది ప్రాణాంతకం కాదనీ చెబుతున్నా జనం నమ్మడం లేదు. కరోనా వ్యాప్తి సందర్భంలో కూడా ఇలాగే చెప్పారంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.

దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.  ఏపీలో ఇప్పటి వరకూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు క ానప్పటికీ.. ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా,  హెచ్‌ఎంపీవీ గురించి, దాని వ్యాప్తి గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్య సదుపాయాలు, మందులు అందుబాటు, ఆక్సిజన్ సరఫరా, అత్య వసర పరిస్థితులు వంటి అనేక అంశాలపైన  ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దీనిపైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని సీనియర్‌ వైద్య నిపుణులు చెబుతున్నారని చెప్పిన ఆయన అయినా చాన్స్ తీసుకోవద్దనీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనీ చంద్రబాబు సూచించారు. 

హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్‌లు, పల్మోనాలజిస్ట్‌లు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌లతో నిపుణుల కమిటీ  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  వైరస్‌ ప్రభావితుల పరీక్ష కోసం, హెచ్‌ఎంపీవీ వైరస్‌ని పరీక్షించడానికి యూనిప్లెక్స్‌ కిట్‌లను సేకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో హెచ్‌ఎంపీవీ పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పుణేలో హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు.

ఐసిఎంఆర్‌ గుర్తింపు పొందిన వీడీఆర్‌ఎల్‌ ల్యాబ్‌లకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. జర్మనీ నుండి  గా 3000 టెస్టింగ్‌ కెపాసిటీ కిట్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే 4.50 లక్షల 95 మాస్క్‌లు, 13.71 లక్షల ట్రిపుల్‌ లేయర్డ్‌ మాస్క్‌లు, 3.52 లక్షల పీపీఈ కిట్లు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలన్నారు.   చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపైన కూడా అధికారులతో సమీక్షించారు.  

అన్ని ప్రభుత్వ బోధన, జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్‌ వార్డులను  సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్‌ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అంతరాయం లేని ఆక్సిజన్‌ సరఫరా, ఆక్సిజన్‌ పైపు లైన్లు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా, పిఎస్‌ఎ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. హ్యాండ్‌ వాష్, మాస్క్‌ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  మరో వైపు తెలంగాణ కూడా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను అదేశంచారు.  ఇలా ఉండగా ప్రధాని నరేంద్రమోడీ కూడా అధికారులతో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.