నరేంద్ర మోడీ చెప్తున్న కొత్త భాష్యాలు

Publish Date:Mar 11, 2013

Advertisement

 

నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్నిముఖ్యమంత్రిగా పాలిస్తున్న2002 సం.లో ఆ రాష్ట్రంలో జరిగిన దారుణమారణకాండ నేటికీ అయన పాలిట పెను శాపంగా మిగిలిపోయి, దేశానికి ప్రధానిగా చేపట్టగల ఒక మహత్తర అవకాశానికి ఆయనని ఆమడ దూరంలో ఉంచుతోంది. గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకుపోతున్న ఆయన గుజరాత్ రాష్ట్రం బయట కాలుపెడితే చాలు, ఇప్పటికీ నిరసనలు ఎదుర్కోక తప్పడం లేదు. ఆయన చేసిన ఘోర తప్పిదమే ఆయనకు, ఆయన ఉజ్వల భవిష్యత్తుకు మద్య ఒక కనిపించని అడ్డుగోడలా నిలిచి, ఆయన తెలివితేటలకు పరీక్ష పెడుతోందిప్పుడు.

 

ఆయన ఇప్పుడు ఒక ద్వైదీమానమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నానాటికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ, ఆయన సమర్ధతకు ప్రపంచ దేశాల ప్రశంసలు. మరో వైపు, ఎక్కడికి వెళితే అక్కడ నిరసనలు, ఆయన రాకకి అభ్యంతరాలు.

 

ఇటీవల డిల్లీలో శ్రీరాం కాలేజీలో ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో లోనున్న విద్యార్ధులు ఎంతో స్పూర్తి పొందగా, అదే కాలేజిలో మరికొందరు విద్యార్దులు బయట నిలబడి ఆయన రాకకు నిరసనలు తెలియజేసారు. ఈ సంఘటన ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న వింత పరిస్థితులకి అద్దం పడుతోంది.

 

ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వైబ్రాంట్ గుజరాత్ సదస్సు’ కు “పాకిస్తాన్” తో సహా అనేక దేశాల నుంచి వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చి ఆయనను, ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని ఋజువు చేసారు. కానీ, మొన్న అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అమెరికా ప్రభుత్వం విసా నిరాకరించడం ఆయనకు చెంప దెబ్బ అయింది. మానవ హక్కులను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనకు వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా తెలియజేసింది. భావి భారత ప్రధాని కావాలని కలలు కంటున్న నరేంద్రమోడీకి ఇది నిజంగా చెంప దెబ్బే అని చెప్పక తప్పదు. అందువల్ల ఆయన అమెరికాకు స్వయంగా వెళ్ళే అవకాశం లేకపోవడంతో, వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుజరాత్ రాష్ట్రం నుండే ఆయన అమెరికాలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

 

ఇక ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటిసారిగా తన పరిపాలనలో జరిగిన తప్పులు (మారణకాండ) గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ప్రభుత్వం చేసిన తప్పులను కూడా క్షమిస్తారు’ అని అన్నారు.

 

అంటే, తానూ అందిస్తున్న సమర్ధమయిన పాలనతో సంతృప్తి పొందిన ప్రజలు, తనను గెలిపించిడం ద్వారా, వారు ‘తన తప్పులను’క్షమించారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. తనవల్ల నష్టపోయిన ప్రజలే తనను మన్నించి గెలిపించినప్పుడు, అమెరికా వంటి ఇతరదేశాలు ఇంకా తటపటాయించడం ఏమిటని ప్రశ్నించడం కూడా ఆయన ఉద్దేశ్యం కావచ్చును.

 

కానీ, దాదాపు 1200 మంది ఆమయకులయిన ప్రజల మరణానికి కారకుడని నిందించబడుతున్న ఆయన, కోర్టుల నుండి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును కానీ, ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆ దారుణానికి గురయిన వర్గం దృష్టిలోఆయన ఎన్నటికీ నేరస్తుడిగానే మిగిలిపోతారు.

 

మంచి వక్తగా పేరున్న నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో తన తప్పులను కప్పిపుచ్చుకొని దేశభక్తి పూరితమయిన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేయవచ్చును. కానీ, తానూ స్వహస్తాలతో వ్రాసుకొన్నతన గత చరిత్రను మాత్రం ఆయన ఎన్నటికీ చెరుపుకోలేరు.

 

ఆయన నోటితోనే ఆయన స్వయంగా ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ‘ప్రభుత్వం చేసిన తప్పులను’ కూడా క్షమిస్తారు’ అని చెప్పడం ద్వారా తానూ చేసిన తప్పులను ఆయన పరోక్షంగానయినా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.

 

అయితే, తన తప్పులకు సవరణలు చేసేబదులు, సదరు వర్గం ప్రజలను తనను క్షమించమని బహిరంగంగా ఆయన కోరిఉంటే, వారు ఆయనను క్షమించేవారేమో! ఒకవేళ వారు క్షమించకపోయినా, ఆయన ఆవిధంగా కోరినందుకు మిగిలిన ప్రజలయినా క్షమించేవారేమో! ఏదిఏమయినపటికీ, ఆయన చేసిన తప్పులే ఆయనకు నేడు శాపాలుగా మారి, ఆయనకు అగ్నిపరీక్షలు పెడుతున్నాయని చెప్పవచ్చును. వాటిని ఆయన అధిగమించి తన ప్రసంగంలో చెప్పినట్లు ‘అన్నిటి కంటే దేశమే మిన్న’ అని ఋజువు చేయగలిగితే ఆయన జన్మ ధన్యం అయినట్లే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.