లోకేష్ భవిష్యత్ కోసం చంద్రబాబు ఆరాటం

Publish Date:May 28, 2013

Advertisement

 

 

జూ.యన్టీఆర్ ఈ రోజు తాతాగారి 90వ జయంతి సందర్భంగా సతీ సమేతంగా నివాళులు అర్పించడానికి యన్టీఆర్ ఘాట్ కి వచ్చారు. అయితే, ఊర్లోనే జరుగుతున్న మహానాడు సమావేశాలకి మాత్రం తనని ఎవరూ పిలవనందున వెళ్ళలేదని చెప్పారు. ఒకవేళ పిలిచి ఉంటే తప్పకుండా వచ్చేవాడినని అన్నారు కూడా. అతని తండ్రి హరికృష్ణ మహానాడుకి వెళ్ళినప్పటికీ అక్కడ అందరూ ఆయనతో అంటీ ముట్టనట్లే వ్యవహరించడంతో ఆయన కూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయారు.

 

చంద్రబాబు తన కొడుకు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, “లోకేష్ వంటి విద్యావంతుడు, వ్యవహార దక్షుడు పార్టీలోకి వస్తే మంచిదేనని అన్నారు. ఇక ముందు తమ పార్టీ యువతకి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుందని, మున్ముందు వారే పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. లోకేష్ తో బాటు , చాలా మంది యువనాయకులు కూడా మహానాడులో హడావుడి చేయడం చూస్తే చంద్రబాబు మాటలు నిజమేనని అనిపించకమానవు.

 

కానీ మరి లోకేష్ ఈడువాడే అయిన జూ.యన్టీఆర్ ను మాత్రం మహానాడుకి ఆహ్వానించకపోవడం గమనిస్తే, అతను తన కొడుకుకి పోటీగా తయారవుతాడనే భయంతోనే చంద్రబాబు అతనిని దూరం పెట్టినట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ జూ.యన్టీఆర్ కనక మహానాడుకి వస్తే అందరి దృష్టీ అతని మీదే ఉంటుంది తప్ప లోకేష్ మీద ఉండదని తెలుసు.

 

లోకేష్ ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువస్తున్న చంద్రబాబు ఇటువంటి ముఖ్యమయిన సమయంలో అందరి దృష్టీ తన కొడుకు మీదే ఉండాలని కోరుకోవడం సహజం. అందువల్లే జూ.యన్టీఆర్ ను ఆహ్వానించలేదేమో. కానీ, మరి రేపు ఎన్నికల సమయంలో కేవలం లోకేష్ ప్రసంగాలతో నెగ్గుకు రావడం సాధ్యమేనా అని ఆలోచిస్తే, అప్పుడు యన్టీఆర్ అవసరం తప్పదని తెలుస్తుంది. మరి అతనిని ఇప్పుడు దూరంగా పెట్టి అప్పుడు అవసరానికి రమ్మంటే అతను వస్తాడా?

 

లోకేష్ ను తన రాజకీయవారసుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరేమో కానీ తేదేపాకు వారసుడని ప్రకటిస్తే మాత్రం పార్టీలోఅలజడి కలగడం ఖాయం. అయితే, ఆయన చాలా తెలివిగా హరికృష్ణకి క్రమంగా పార్టీలో ప్రాదాన్యత తగ్గించడంతో, ఆయనతో బాటు జూ.యన్టీఆర్ కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక పార్టీలో ప్రస్తుతం వారిరువురూ తప్ప నందమూరి కుటుంబంలో చంద్రబాబుని వేలెత్తి చూపగలిగేవారెవరూ లేరు గనుక, చంద్రబాబు ఇక తన కొడుకు లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్దం చేసుకోవడానికే ఉన్న ఒక్క నందమూరి వారసుడు బాలకృష్ణని దగ్గర చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది.

 

బాలకృష్ణకి కూడా పార్టీ పగ్గాలు చెప్పట్టాలని మనసులో కోరిక ఉన్నపటికీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం తన వల్ల కాదని గ్రహించడం వలననే, లోకేష్ విషయంలో అడ్డు చెప్పడం లేదనుకోవచ్చును. పైగా అతను స్వయాన్న అల్లుడే గనుక ఇక బాలకృష్ణ అతనికి పోటీగా నిలబడే ఆలోచన కూడా చేయక పోవచ్చును. చంద్రబాబుకి కూడా ఈ విషయం తెలుసు గనుకనే బాలకృష్ణ విషయంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. ఇక తరువాత అంకం లోకేష్ ను ఎన్నికలలో నిలబెట్టడమే తరువాయి.

 

అయితే, రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలావుంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం గనుక, ముందుగా పార్టీ శ్రేణులకి లోకేష్ తమ తదుపరి నాయకుడనే భావం కలిగేలా తగిన కార్యక్రమాలు రూపొందించి, ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేరుగా సురక్షితమయిన కుప్పం నియోజక వర్గం నుండి పోటీ చేయించడమో లేక తానే కుప్పంతో బాటు మరో చోట నుండి (శేరిలింగంపల్లి) కూడా పోటీ చేసి, ఆ తరువాత కుప్పంకు రాజీనామా చేసి కొడుక్కి చోటు కల్పించడమో చంద్రబాబు చేయవచ్చును.

 

ఒకవేళ రాబోయే ఎన్నికలలో పార్టీ విజయం సాదించి అధికారంలోకి వస్తే, అప్పుడు ఇక తన మాటకు ఎలాగు తిరుగు ఉండదు కనుక తాను ముఖ్యమంత్రి పదవిలోకి మారి తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ గనుక ఎన్నికలలో ఓడిపోతే, అప్పుడు కూడా తన సీట్లో లోకేష్ బాబుని కూర్చోబెట్టి ఇక తను రాజకీయాల నుండి రిటైర్ మెంట్ తీసుకోవచ్చును. అయితే ఈ కార్యక్రమమంతా వచ్చే ఎన్నికలలోగా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంటుంది గనుక, ముందుగా లోకేష్ బాటలో ఉన్న ముళ్ళను ఏరి పారేసి ఆ తరువాత కార్యక్రమానికి చంద్రబాబు నడుం బిగిస్తున్నట్లు అర్ధం అవుతోంది.

 

మరి సినిమాలతో బిజీగా ఉన్న జూ.యన్టీఆర్ ఇప్పుడప్పుడే రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు గనుక అతను రాజకీయాలలోకి వచ్చే నాటికి లోకేష్ కి పట్టాభిషేకం చేసేస్తే ఇక చంద్రబాబు నిశ్చింతగా ఉండవచ్చునని ఆలోచిస్తున్నారేమో. ఏమయినప్పటికీ, రాబోయే ఎన్నికల తరువాత తెదేపాలో కీలక మార్పులు జరగడం మాత్రం తధ్యం.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.