టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను తాము మర్చిపోబోమని, అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత లోకేష్ చెప్పారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ను నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వంపై పోరాడితే సీఎం జగన్ జైల్లో పెట్టిస్తున్నారని అయన విమర్శించారు. "పేద ప్రజల నుంచి దొడ్డిదారిన రూ.5 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అన్నీ బయటపడతాయి... కనీసం 40 మంది జైలుకు వెళతారు.. పేద ప్రజల జేబులు కొట్టినోడు ఎవరూ బయటలేరండీ.. గ్యారంటీగా అందరు జైలుకు వెళతారు... ఎలాగూ వైసీపీ అనేది ఒక జైలు పార్టీయే కదా. పార్టీ అధ్యక్షుడూ జైలే... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా జైలే... దీంతో ఇక ఎమ్మెల్యేలు మేం కూడా జైలుకు వెళ్లొస్తాం అంటున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఇంతకూ ఇంత వడ్డీ తో సహా కలిపి చెల్లించి తీరుతాం అని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం 16నెలల నుంచి అధికారంలో ఉందని, కానీ టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా? అని అయన ప్రశ్నించారు. అదే జగన్ మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు. ఇక రానున్న రోజుల్లోనూ కొన్ని వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రులందరికీ అసహనం చాలా పెరిగిపోయింది. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి కూడా అసహనంతో మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని సొంత మంత్రులు చంద్రబాబు పేరు మాత్రం నిత్యం జపిస్తున్నారు. పాపం నిద్రలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు వైసీపీ నేతల కలలోకి చంద్రబాబే వస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.
ఒక మతంపై వరుస దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీబీఐ విచారణ జరగాల్సిందే. ఏదైనా ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ వరుస సంఘటనలు చూస్తుంటే దీంట్లో ఎదో కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఓ రథం దగ్ధం చేశారని, తాజాగా అంతర్వేదిలోనూ అదే ఘటన జరిగిందని అయన తెలిపారు. మరోపక్క గుంటూరు జిల్లాలోని ఒక ఆలయంలో తల దువ్వుకోవద్దని చెప్పినందుకు ఆలయ అర్చకుడ్ని అన్యాయంగా చితకబాదారని.. దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడని కూడా తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది.. కానీ ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. ఎవరైనా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై ప్రభుత్వం బనాయాయించింది ముమ్మాటికీ దొంగ కేసులే. ప్రతిపక్షాలపై ఎక్కడలేని వింత వింత కేసులన్నీప్రయోగిస్తున్నారు. ఒక పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కూడా కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ తో సహా 36మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అయితే టీడీపీ అన్నింటికీ సిద్ధంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-fires-on-ycp-govt-25-103882.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.