టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను తాము మర్చిపోబోమని, అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత లోకేష్ చెప్పారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు ను నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వంపై పోరాడితే సీఎం జగన్ జైల్లో పెట్టిస్తున్నారని అయన విమర్శించారు. "పేద ప్రజల నుంచి దొడ్డిదారిన రూ.5 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అన్నీ బయటపడతాయి... కనీసం 40 మంది జైలుకు వెళతారు.. పేద ప్రజల జేబులు కొట్టినోడు ఎవరూ బయటలేరండీ.. గ్యారంటీగా అందరు జైలుకు వెళతారు... ఎలాగూ వైసీపీ అనేది ఒక జైలు పార్టీయే కదా. పార్టీ అధ్యక్షుడూ జైలే... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా జైలే... దీంతో ఇక ఎమ్మెల్యేలు మేం కూడా జైలుకు వెళ్లొస్తాం అంటున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీకి ఇంతకూ ఇంత వడ్డీ తో సహా కలిపి చెల్లించి తీరుతాం అని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం 16నెలల నుంచి అధికారంలో ఉందని, కానీ టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపించారా? అని అయన ప్రశ్నించారు. అదే జగన్ మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారు. ఇక రానున్న రోజుల్లోనూ కొన్ని వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మంత్రులందరికీ అసహనం చాలా పెరిగిపోయింది. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి కూడా అసహనంతో మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని సొంత మంత్రులు చంద్రబాబు పేరు మాత్రం నిత్యం జపిస్తున్నారు. పాపం నిద్రలేచిన దగ్గర నుంచీ పడుకునే వరకు వైసీపీ నేతల కలలోకి చంద్రబాబే వస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.
ఒక మతంపై వరుస దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సీబీఐ విచారణ జరగాల్సిందే. ఏదైనా ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ వరుస సంఘటనలు చూస్తుంటే దీంట్లో ఎదో కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఓ రథం దగ్ధం చేశారని, తాజాగా అంతర్వేదిలోనూ అదే ఘటన జరిగిందని అయన తెలిపారు. మరోపక్క గుంటూరు జిల్లాలోని ఒక ఆలయంలో తల దువ్వుకోవద్దని చెప్పినందుకు ఆలయ అర్చకుడ్ని అన్యాయంగా చితకబాదారని.. దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడని కూడా తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది.. కానీ ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. ఎవరైనా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై ప్రభుత్వం బనాయాయించింది ముమ్మాటికీ దొంగ కేసులే. ప్రతిపక్షాలపై ఎక్కడలేని వింత వింత కేసులన్నీప్రయోగిస్తున్నారు. ఒక పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కూడా కేసులు పెట్టారు. అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్ తో సహా 36మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అయితే టీడీపీ అన్నింటికీ సిద్ధంగా ఉంది అని లోకేష్ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-fires-on-ycp-govt-25-103882.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.