బలమయిన పునాది నిర్మించుకొంటున్న నారా లోకేష్

Publish Date:Sep 11, 2015

Advertisement

 

తెదేపా యువనేత నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు చాలా అవకాశం ఉన్నప్పటికీ ఆయన తొందరపడటం లేదు. 2014లో జరిగిన ఎన్నికలలోనే ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలలో లేదా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ వహారాల గురించి చర్చిస్తూ పార్టీని బలోపేతం చేయడంపైనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. నేటి నుండి ఆయన పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలను మొదట తిరుపతి నుండి మొదలుపెడతారు. ఆ తరువాత వరుసగా కందుకూరు, తాడేపల్లిగూడెం, అరుకు తదితర ప్రాంతాలలో పర్యటించి పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు.

 

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ అనుబంధం పెంచుకొన్నట్లయితే వారి పూర్తి మద్దతు పొందవచ్చును. పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించవచ్చును. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేసుకోవచ్చును. ఏదో ఒకనాడు ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయం కనుక ప్రస్తుతం ఆయన చేస్తున్న కృషి వలన చాలా మంచి ఫలితాలే ఆశించవచ్చును. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా పార్టీ వ్యవహారాలపై పట్టు పెంచుకొని అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు.

 

ఒకవేళ లోకేష్ కూడా ఎన్నికలలో పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినట్లయితే అప్పుడు తెరాస పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలనే తెదేపా కూడా ఎదుర్కోవలసి వచ్చేది. తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నంత కాలం పార్టీ వ్యవహారాలకే పూర్తి సమయం కేటాయించిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత పార్టీ వ్యవహారాలు చూసేందుకు అసలు సమయం కేటాయించలేకపోతున్నారు. కనుక పార్టీ వ్యవహారాలను చూసుకొనేందుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొడుకు కె.టి.ఆర్. ని కానీ కూతురు కవితను గానీ నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారిరువురూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కనుక వారికీ ఇటువంటి ఇబ్బందే ఎదురవవచ్చును. పార్టీకి పూర్తి సమయం కేటాయించేందుకు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

కనుక ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ వ్యవహారాలు చూసుకోవాలనే లోకేష్ నిర్ణయం సరయినదేనని స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకొని, పార్టీ వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించి తెదేపాని మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలిగితే ఇక నారా లోకేష్ వెనక్కి తిరిగి చూసుకోనవసరం ఉండదు. అప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు స్వీకరించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.