నంద్యాల అటు ఇటైతే పీకే పరిస్థితేంటి..?

Publish Date:Aug 26, 2017

Advertisement

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ న్యూస్ ఏమైనా ఉందా అంటే అది నంద్యాల ఉప ఎన్నిక అనే చెప్పవచ్చు. ప్రజల నాడికి గీటురాయిగా..2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డాయి. 80శాతం పైచీలుకు పైగా జరిగిన పోలింగ్‌తో..ఓటర్లు ఎవరికి విజయాన్ని అందించబోతున్నారో సోమవారం తెలిసిపోనుంది. ఆ సంగతి పక్కనబెడితే నంద్యాల ఫలితం ఇరు పార్టీల్లో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా అధికారానికి దూరమై..ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చొన్న వైసీపీ ఒకవేళ నంద్యాలలో ఓడితే కనుక ఆ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ పంచన చేరి..పార్టీ పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉండవచ్చంటున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి భవితవ్యంతో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి కార్యదక్షతకు, సామర్థ్యంపై వైసీపీ శ్రేణుల్లో తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఎవరో కాదు..రాజకీయ వ్యూహకర్తగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న ప్రశాంత్ కిశోర్. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్ అండ్ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సర్వేలు పూర్తీ చేసి ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో..ఏం చేయకూడదో ప్రశాంత్ పలు సూచనలు కూడా చేశారు. ఇంకా అనేక కొత్త వ్యూహాల మీద కసరత్తు కూడా జరుగుతున్న సమయంలో నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది.

 

ప్రశాంత్‌ రాక పార్టీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోవడానికి రెండేళ్ల వరకు ఆగకుండానే.. ఈ లోగానే..నంద్యాల రూపంలో అవకాశం అందివచ్చింది. జగన్ కూడా ప్రశాంత్ కిశోర్ సత్తాను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించారు. అందుకు తగినట్లుగానే తనదైన మార్గాల ద్వారా నంద్యాలలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకున్నారు. దానిలో భాగంగానే టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డిని వైసీపీలోకి చేర్చుకోవడం..ఆయనకు టికెట్ ఇప్పించడం..ఎన్నికల వ్యవహారాలు ఇలా ప్రతీ ఒక్కటి ప్రశాంత్ కనుసన్నల్లోనే జరిగాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడాల్సిన స్క్రిప్ట్‌ను కూడా ప్రశాంత్ దగ్గరుండి రాయించారట..

 

అలా అంతా తానై వ్యవహరించిన చోట ఓడిపోతే మాత్రం ప్రశాంత్‌ సామర్థ్యంపై జగన్‌తో పాటు వైసీపీ జనాలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. మాములుగా జగన్ ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా..ఎవ్వరి మాటకు పెద్దగా విలువ ఇవ్వరని అంటూ ఉంటారు. కానీ ప్రశాంత్ మాటలను వైసీపీ అధినేత తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అప్పుడు ఆ విలువ కూడా ఇవ్వకుండా తనకు నచ్చిన రీతిన జగన్ సాగే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రశాంత్ కిశోర్‌ నంద్యాల పరీక్షలో నెగ్గుతారో లేదో వేచి చూడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.