బాలయ్య, పవన్ రంగంలోకి దిగితే జగన్ తట్టుకోగలరా..?

Publish Date:Aug 10, 2017

Advertisement

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు ఎవరి స్టామినా ఏంటో..మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజల మనసులో ఏముందో..ప్రతిపక్షంపై అసలు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సర్వేలతో అయ్యే పనికాదు. అందుకే నంద్యాలపై పాలక, ప్రతిపక్షాలు అంతగా ఫోకస్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటు నిర్ణయాత్మకమే..అందుకే ఇరు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులును నంద్యాలకు తరలించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇరు వర్గాలు. వైసీపీ అధినేత జగన్ ప్రచార పర్వంలోకి దిగడంతో ప్రచారానికి ఊపు వచ్చింది. దీంతో తాము వెనుకబడ్డామని భావించారో ఏమో తెలియదు కానీ అపర చాణుక్యుడు చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు.

 

రాయలసీమ ప్రాంతంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇక బాలయ్యకు తోడుగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని కూడా రంగంలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంపై పవన్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను మరింత పటిష్టం చేసుకునే దిశలో ముందుకు సాగుతున్నారు పవన్. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి మద్దతిస్తే జనసేనకు ప్లస్సా..? మైనస్సా  అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

 

ఈ మూడేళ్లలో ఉద్దానం కిడ్నీ బాధితులు , ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినా మిత్రపక్షం నుంచి బయటికి రాలేదు. పలుసార్లు సీఎం చంద్రబాబును కలిసి సమస్యలు వివరించారే తప్ప.. అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో నంద్యాల ఉప ఎన్నికకు పవన్ తమకే మద్దతు ప్రకటిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కనుక సైకిల్‌కే సై అంటే మాత్రం జగన్‌కు నష్టమే..2 లక్షల 9 వేల 612 మంది ఓటర్లు ఉన్న నంద్యాలలో బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా..పవర్ స్టార్ టీడీపీ తరపున ప్రచారంలోకి దిగితే అది బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరో వైపు మెగా కుటుంబంతో భూమా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా దంపతులు పీఆర్‌పీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009లో ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి భూమా అఖిల ప్రియ బలంగా విశ్వసిస్తున్నారు. నంద్యాలలో విజయం తమదేనని భావిస్తున్న వైసీపీ నేతలు పవన్, బాలయ్య ప్రచారంలోకి వస్తే వారిని తమ అధినేత ఏ విధంగా నిలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.