ఇప్పుడు ఆత్మీయయాత్ర ఎందుకో

Publish Date:Jun 26, 2013

Advertisement

 

తెరాస బాకా పత్రిక ‘నమస్తే తెలంగాణా’ కి రాష్ట్ర విభజనని వ్యతిరేఖిస్తున్న అంధ్రాప్రాంత ప్రజలకి తెలంగాణా విభజన పట్ల కలిగే లాభాలను వివరించాలని అకస్మాత్తుగా బుద్ది పుట్టింది. అనుకొందే తడవుగా ‘ఆత్మీయయాత్ర’ అనే పేరు తగిలించుకొని అంధ్రాప్రాంతంలో పర్యటన మొదలుపెట్టేసింది కూడా. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని ప్రజలకి నచ్చజెప్పడం దాని మరో ఉద్దేశ్యం.

 

ఆంధ్ర ప్రాంత ప్రజలను నోటికి వచ్చినట్లు తిడుతూ, ఇంత కాలంగా అన్నదమ్ములవలె కలిసి న్నరెండు ప్రాంతాల ప్రజల మద్య పెట్టవలసిన చిచ్చుఅంతాపెట్టిన తరువాత,ఇప్పుడు ఆ పుండు మీద కారం చల్లడానికన్నట్లు, మొదలుపెట్టిన ఈ ‘ఆత్మీయయాత్ర’కి ఎటువంటి స్పందన వస్తుందో తెలియకనే ఈ యాత్ర మొదలుపెట్టలేదు.

 

మొన్న రఘునందన్ రావు హరీష్ రావుపై చేసిన వసూళ్ళ ఆరోపణలతో, నిన్నఆంధ్రజ్యోతి పత్రికలో కేటీఆర్ మీద సెటిల్మెంటు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ కుటుంబం మీద, ఇటీవల హైదరాబాదులోని ఒక సాధారణ ఆటో డ్రైవర్ లక్ష్మి నారాయణ అనే యువకుడు తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకొంటూ వ్రాసిన లేఖలో కేసీఆర్ , అతని కుటుంబ సభ్యులు ఉద్యమాలు పక్కన బెట్టి, ఎన్నికలు పేరుతో డబ్బు సంపాదన కోసం అర్రులు చాస్తునారంటూ చేసిన ఆరోపణలు, తన చావుకి కేసీఆరే కారణమని స్పష్టంగా వ్రాయడంతో ప్రజలకి సమాధానం చెప్పలేక కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు నానాఅవస్థలు పడుతున్నారు. బహుశః వీటన్నిటి నుండి బయటపడేందుకే, కేసీఆర్ తన చేతిలో ఉన్న ‘నమస్తే పత్రిక’ని ఈ యాత్రకి పంపించి ఉండవచ్చును.

 

దాని పర్యవసానం ఎలాఉంటుందో తెలియని అజ్ఞాని కాదు అతను. ఊహించినట్లే, నమస్తే పత్రికపై కొందరు దాడి చేయడం వెన్వెంటనే తెలంగాణాలో నిరసనలు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలూ, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు అంతా ఖచ్చితంగా జరిగిపోయాయి. ఇప్పటికే, రెండు ప్రాంతాల మధ్య ప్రజల మద్య చిచ్చుపెట్టిన కేసీఆర్ కుటుంబం, తనను తాను రక్షించుకొనేందుకు, ఇప్పుడు మీడియాకు కూడా ఆజాడ్యం అట్టించాలని ప్రయత్నిస్తునట్లు కనబడుతోంది.

 

ఇక,ఒక సాదారణ ఆటో డ్రైవర్ కూడా కేసీఆర్ తెలంగాణా ఉద్యమాలలో నిబద్దత లేదని గుర్తించి ఎత్తిచూపినపుడు, అక్కడి ప్రజలకి ఈ విషయం తెలియదని, వారు గ్రహించలేరని కేసీఆర్ కి తెలియకపోదు. తన పదేళ్ళ తెలంగాణా అంశాన్ని ఎన్నికలు దగ్గిరపడుతున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి ఎత్తుకుపోవాలని చూస్తుండగా, మరో వైపు వసూళ్లు, సెటిల్మెంటులు, కిడ్నాపులు ఆరోపణలలో చిక్కుకోవడం, కేసీఆర్ కే కాదు ఆపరిస్థితుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడయినా ఎలాగయినా బయటపడి, పరిస్థితులను మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా బహుశః అదే చేసాడని చెప్పవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులను ఎదుర్కోవడానికి, పనిలోపనిగా తమమీద వస్తున్న ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ ఆత్మీయయాత్ర మొదలుపెట్టించి ఉండవచ్చును. ఎన్నికల కోసం తెలంగాణా ఉద్యమాలను పక్కన పడేసిన తరువాత, చల్లబడిన తెలంగాణా సెంటిమెంటుని కూడా పనిలోపనిగా ఈ యాత్ర ద్వారా రెచ్చగొడితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.

 

కేసీఆర్ కి లేదా నమస్తే తెలంగాణా పత్రికకి నిజంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం సృష్టించి, అన్నదమ్ములుగా విడిపోయేలా చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే, ఇటువంటి చవకబారు ఆలోచనలకు బదులు, ఇరుప్రాంతాల మేధావులను ఒక చోటకు చేర్చి అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండేవారు.

 

రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగి, పరిష్కరించబడవలసిన తెలంగాణా సమస్యను కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకొని, ఉద్యమాలు చేసుకొంటూ రాష్ట్రాన్ని తిరోగమన పధంలోకి నడిపిస్తున్న కేసీఆర్, తన స్వలాభం కోసం ఇటువంటి నీచమయిన ఎత్తుగడలకి పాల్పడటం అందరూ ఖండించాల్సిందే.

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.