అసంతృప్తిని మంత్రి పదవిపై ఆశ మింగేసిందా?

Publish Date:Sep 12, 2022

Advertisement

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు.ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే. గత కొంత కాలంగా ఆయన వైసీసీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేబినెట్ లో చోటు లభించలేదన్న అసంతృప్తే అందుకు కారణమని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరాఖరికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి చేతులు కాల్చుకున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తూతూ మంత్రంగానే పాల్గొన్నారు.

 వైఎస్  మరణం తర్వాత...  జగన్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ... వైసీపీని స్థాపించిన సమయంలో  నెల్లూరు జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొలి నేతనల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. దాంతో జగన్ ఆయనకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  అయితే తరువాత ఆ బాధ్యతల నుంచి ప్రసన్నకుమార్ రెడ్డిని తప్పించి  కాకాణి గోవర్థన్ రెడ్డికి   అప్పగించారు. సరే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ తొలి కేబినెట్ లో స్థానం ఆశించారు. కానీ భంగపడ్డారు. ఆ భంగపాటును ఎలాగోలా ఓర్చుకున్నా మూడేళ్ల తరువాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో నొచ్చుకున్నారు.  తనకు మంత్రి పదవి దక్కక పోవడం కంటే జిల్లాలో తన కంటే జూనియర్లు..  సబ్ జూనియర్లు అయిన.. మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు తొలి కేబినెట్‌లో చోటు దక్కడం.. అలాగే కాకాణి గోవర్థన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో బెర్త్ కేటాయించడం  ప్రసన్న కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి.

ఆ అసంతృప్తి కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. అయితే హఠాత్తుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క సారిగా జగన్ ను ఆకాసానికి ఎత్తేస్తున్న చందంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా సీఎం జగన్ ది ప్రధాన మంత్రి స్థాయి అని పొగిడేశారు. రాష్ట్ర ప్రజలు ఆయనే మరో సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ చేసిన ప్రకటన పార్టీ శ్రేణులనే నివ్వెర పరిచింది. ఇంత కాలం పార్టీలో అసమ్మతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడమేమిటా అని ఆశ్చర్య పోయారు. కాగా ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించడానికి ఆయన త్వరలో మరోసారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయం తీసుకోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి తూతూ మంత్రంగా పాల్గొనడంపై   తాడేపల్లి ప్యాలెస్ నుంచి గట్టిగానే మందలింపులు అందినా కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా జగన్ పై ఎక్కడ లేని అభిమానాన్నీ ఒలకబొస్తూ పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఆయనలో చిగురించిన మంత్రి పదవి ఆశేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం జగన్ మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. పార్టీపైనా, తన కుటుంబంపైనా  ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు సంధిస్తున్నా మంత్రులు స్పందించడంలేదని జగన్ ఫైర్ అయ్యారు.  తన తొలి కేబినెట్‌లో మంత్రులు   చలాకీగా ఉండేవారని చెబుతూ,  కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్,  కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించారు. అదే సందర్భంగాఇప్పటికైనా మంత్రులు తీరు మార్చుకోకుంటే పదవులు పీకేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదిగో ఆ హెచ్చరికతోనే రాష్ట్రంలో జగన్ తన కెబినెట్ ను మరో సారి పునర్వ్యవస్థీకరిస్తారనే  టాక్ జోరందుకుంది. ఈ నేపథ్యలోనే ప్రసన్నకుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవిపై ఆశ ప్రసన్న కుమార్ రెడ్డిలోని  అసంతృప్తిని మింగేసిందని అంటున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.