మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున కేసు.. వాంగ్మూలాల్లో తేడాలున్నాయా?

Publish Date:Oct 8, 2024

Advertisement

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి. తాను ఒక‌టి అనుకుంటే దైవం మ‌రొక‌టి త‌ల‌చిద‌న్న‌ట్లుగా.. కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను టార్గెట్ గా వ్యాఖ్య‌లు చేయ‌బోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగేశారు. అప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని హైడ్రా త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ ను కూల్చేసింద‌ని ర‌గిలిపోతున్న నాగార్జు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగార్జునే రిక్వెస్ట్ చేశారో ఏమో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా  సినీ ఇండ‌స్ట్రీ మొత్తం  ఏక‌మైంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను దాదాపు సినీ ప్ర‌ముఖులు అందరూ ఖండించారు. ప‌నిలో ప‌నిగా కొంద‌రు నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా దుమ్మెత్తిపోశారు.  హైడ్రా, రైతు రుణ‌మాఫీ విష‌యంలో వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌తో అసలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నరేవంత్ ప్ర‌భుత్వానికి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను  చేప‌ట్టింది. కాంగ్రెస్ పెద్ద‌లు కొండా సురేఖ‌ను మంద‌లించ‌డంతో ఆమె ప‌ది మెట్లు దిగొచ్చి నాగార్జున ఫ్యామిలీకి, స‌మంత‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన కోప‌మో.. నాగ‌చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారంపై ప్ర‌తి ఒక్క‌రూ కామెంట్స్ చేస్తున్నార‌న్న ఆగ్రహమో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేద‌ని లేద‌ని శ‌పధం చేసిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుపై ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రి ఫొటోల‌తో కేటీఆర్‌, హ‌రీశ్ రావు డీపీలు పెట్టుకున్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో వీరి గురించి అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, హ‌రీశ్ రావు సురేఖ‌పై పెట్టిన పోస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌మంత కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగార్జున‌, స‌మంత వైపు నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నాగార్జున మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో ఆమెపై నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు.   ఈ పిటిష‌న్‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా..  త‌మ ఎదుట హాజ‌రై వాంగ్మూలం  ఇవ్వాల్సిందిగా నాగార్జున‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం నాగార్జున‌, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌తోపాటు సుప్రియ‌ కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను రికార్డు చేసింది. అలాగే మొద‌టి సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. అక్టోబ‌రు 10న మ‌రో సాక్షికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయ‌నున్న‌ట్లు చెప్పి.. త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసింది.

నాగార్జున మంత్రి కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో కొంద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసి వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రిపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రి కాద‌ని అంటున్నారు. పొర‌పాటు జ‌రిగింద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ చెప్పినా నాగార్జు ఇంత మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే అగ్ర‌ కులానికి చెందిన మంత్రి అయితే నాగార్జున ఇలానే వ్య‌వ‌హ‌రించేవారా అంటూ బీసీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ వెన‌కుండి నాగార్జున‌ను న‌డిపిస్తున్నద‌ని.. బీఆర్ ఎస్ రాజ‌కీయాల్లో నాగార్జున పావుగా మారారని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, మంత్రి సురేఖ పై ప‌రువు న‌ష్టం దావా కోర్టులో నిల‌వ‌ద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. నాగార్జున ఒకటి చెప్ప‌గా.. సుప్రియ త‌న వాగ్మూలంలో మ‌రొకొటి చెప్పింద‌ని దీంతో కోర్టు నాగార్జున పిటిష‌న్ ను కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ విష‌యంపై మంత్రి కొండా సురేఖ త‌ర‌పున న్యాయ‌వాది మీడియాతో మాట్లాడాడు. 

మంత్రి కొండా సురేఖ‌పై సినీ న‌టుడు నాగార్జున దాఖ‌లు చేసిన కేసు నిల‌బ‌డ‌ద‌ని అనుకుంటున్నామ‌ని ఆమె త‌ర‌పున న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో ముగ్గురు వ్య‌క్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. నాగార్జున పిటిష‌న్ లో ఒక‌టి చెప్పారు. వాంగ్మూలంలో మ‌రొక‌టి చెప్పారు.  సుప్రియ వాంగ్మూలంలో ఇంకొక‌టి చెప్పారు. సుప్రియను సాక్షిగా కోర్టు ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 10న మ‌రొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఒక‌వేళ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని న్యాయ‌స్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయ‌ప‌రంగానే ఎదుర్కొంటామ‌ని కొండా సురేఖ త‌ర‌పు లాయ‌ర్ చెప్పారు. అయితే, మంత్రి కొండా సురేఖ‌పై కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె అనుచ‌రులు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి నాగార్జున‌, కొండా సురేఖ ఎపిషోడ్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డే ప‌రిస్థితులు క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు.

By
en-us Political News

  
పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.
ట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు. ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయం దిశగా నడిపించి ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ తహతహలాడారు. అయితే ముచ్చటగా మూడో సారి సీఎం కావాలన్న కేసీఆర్ కలలు, ఆశలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఏమిటనుకుంటున్నారా?
వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ మేరకు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నంబర్ 11 తో నెటిజనులు మరో సారి వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. 11 నుంచి ప్రారంభయమ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆ 11 మందీ హాజరౌతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పురాణం విప్పారు. దీనిపై తెలుగుదేశం శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
అజిత్ పవార్ మృతితో విలీనానికి బ్రేక్ పడిందన్నారు. ఇక పోతే అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తనకు తెలియదన్న శరద్ పవార్, అసలు ఎన్సీపీ (అజిత్ పవార్)లో ఏం జరుగుతోందన్న విషయం తనకు తెలియదన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ ఆరు నెలలలోగా రాజీనామా చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆమె స్థానంలో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ సభ్యురాలైన సుచిత్రా పవార్ నియమకాన్ని ఖరారు చేసేందుకు ఎన్సీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శనివారం మధ్యాహ్నం ముంబైలోని విధాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో సునేత్రాపవార్ ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.