నాగపూర్ వాలానే నూతన అధ్యక్షుడు?!

Publish Date:Apr 3, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా  పదవీ కాలం ఎప్పుడో  ముగిసి పోయింది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన సెకండ్  టర్మ్ కూడా పూర్తయింది.   అయితే లోక్ సభ ఎన్నికలతో పాటుగా అనేక ఇతర కారణాల వలన, దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడడంతో  నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా లేటవుతూ  వస్తోంది. అయితే  ఇక వాయిదా ఉండదని ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ఎన్నిక క్రతువు పూర్తవుతుందని పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. ఏప్రిల్ 18,19, 20 తేదీల్లో  జరిగే జాతీయ కార్యవర్గ  సమావేశాలలో, లేదా సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధక్షుని ప్రకటన ఉంటుందని అంటున్నారు. 

అయితే నడ్డా స్థానంలో వచ్చే కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రం ఈ రోజు వరకు ఎవరికీ స్పష్టత లేదు. నిజానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సైతం కొత్త అధ్యక్షుడు ఎవరనేది తెలియదని పార్టీ కీలక నేతలే అంటున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అయితే కొత్త అధ్యక్షుడు ఎవరో దేవుడికి కూడా తెలియదని మీడియా ముఖంగానే చెప్పారు. అది కొంచెం అతిశయోక్తి అయినా నూతన అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో ఏర్పడిన చిక్కుముళ్ళు ఇంకా పూర్తిగా విడి పోలేదనేది మాత్రం నిజం.  సో.. కౌన్ బనేగా  బీజేపీ అధ్యక్ష్ ? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని, సమాధానం తెలియని ప్రశ్నగానే  ఉందని అంటున్నారు.  అయితే అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణాలుగా చెపుతూ వచ్చిన పార్లమెంట్,  అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ సమావేశాలు, ఇతరత్రా బిజీ ..బిజీ వ్యవహారాలు ముగిసి పోవడంతో ఇక అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఉపందుకుంటుంది అంటున్నారు. 

అవును  ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ ఆసెంబ్లీ ఎన్నికలతో ప్రస్తుతానికిఎలక్షన్ సీజన్ ముగిసింది. ఈ సంవత్సరం చివర్లో (అక్టోబర్, నవంబర్) జరిగే  బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశం మొత్తంలో ఎక్కడా ప్రధాన ఎన్నికలు లేవు. అలాగే  ప్రస్తుతం జరుగతున్నపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  మార్చి4న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడతాయి. సో పార్టీ అధిష్టానం సంస్థాగత వ్యహరాలపై, ముఖ్యంగా, జాతీయ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా తెలంగాణ సహా మరి కొన్నిరాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల పై దృష్టిని కేద్రీకరిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే మరోవంక బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఇంతగా జాప్యం జరగడానికి వరస ఎన్నికలు, ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్  బడ్జెట్ సమావేశాలు మాత్రమే కారణమా? లేక  ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే, ఉన్నాయనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడం కూడా అద్యక్ష ఎన్నికల జాప్యానికి ఒక ప్రధాన కారణంగా పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు  బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడానికి, ఎన్నికలకు ముందు పార్టీ అద్యక్షు జేపీ నడ్డా, చేసిన వ్యాఖ్యలు పైకి కనిపించే కారణం అయినా, బీజేపీలో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు చెక్  పెట్టే ఉద్దేశంతోనే, ఆర్ఎస్ఎస్ పెద్దలు పార్టీ సంస్థాగత ఎన్నికల పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు నాగపూర్  వర్గాల సమాచారం. 

అయితే, ప్రధాని మోదీ నాగపూర్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల నేపధ్యంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తిరిగి వేగం పుంజుకుంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అందులో భాగంగానే,రానున్నవారం పది రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.ఆ వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభమవుతుంది. అయితే పార్టీ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు, ఇటీవల బెంగుళూరులో జరిగిన,ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిథి సభలో నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఒక విధంగా వందేళ్ళ పండగ చేసుకుంటున్న సమయంలో, ఆర్టికల్ 370 రద్దు , రామ జన్మభూమి మొదలు ప్రస్తుత వక్ఫ్ సవరణ చట్టం వరకు ఆరఎస్ఎస్’ అజెండా’ లోని ఒక్కొక అంశం నెరవేరుతున్న నేపద్యంలో, ఆర్ఎస్ఎస్ – బీజేపీల మధ్య సైధాంతిక బంధం మరింత బలపడేందుకు దోహదం చేసే ... నాగపూర్ వాలనే బీజీపీ నూతన అధ్యక్షుడు అవుతారని అంటున్నారు.

By
en-us Political News

  
 2008 ముంబై పేలుళ్లకు సూత్రధారి అయిన హుస్సేన్  రానా ఎన్ఐఎన్ అధికారులు విచారణ చేస్తున్నారు.   అమెరికా నుండి భారత్ వచ్చిన రానా ను  ఎన్ ఐ ఎన్  అధికారులు  నిన్న అర్దరాత్రి కోర్టులో ప్రవేశ పెట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.
 మాతృదేవో భవ , పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ అని అంటాం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయింది.  
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మూల్యాంకనం, రీ వెరిఫికేషన్‌, కంప్యూటరీకరణ ప్రక్రియలు పూర్తి కావడంతో ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై గురువారం (ఏప్రిల్ 10) గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
 ఆరుగాలం కష్ట పడిన రైతు గిట్టుబాటు లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో  మరో  రైతు  గురువారం(10 ఏప్రిల్) పొద్దుపోయాక ఆత్మహత్య  చేసుకున్నాడు
మాజీ సీఎం జగన్‌ భద్రత కల్పించడంతో కూటమి సర్కారు విఫలమైందని చిత్రీకరించడానికి ఆ పార్టీ నేతలు గీసిన స్కెచ్ విఫలమైంది. ఈ నెల 8న జగన్‌ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విమానయానానికి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్న తరుణంలో విశాఖ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సింది పోయి.. ఉన్న సర్వీసులే రద్దౌతున్నాయి. పేరుగొప్ప ఊరు దిబ్బ లా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికాలో హెలికాప్టర్ నదిలో కూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో జర్మనీకి చెందిన ఐటీ కంపెనీ హెడ్ కుటుంబం మొత్తం మరణించింది.
అనగనగా ఒక ఊళ్లో ఒకామె ఉంది. మహా రచ్చలమారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుంది. ఎలాగంటే.. ఆమెను ఎవరైనా ‘అమ్మా’ అని పిలిస్తే.. ‘ఠాట్.. నన్ను అమ్మా అంటావా.. అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా.. నేనేమైనా నీ అయ్యకు పెళ్లాన్నా..’ అంటూ గొడవకు దిగుతుంది.
కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ నుంచి శంఖారావం పూరించింది. అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశంలో న్యాయ్ ఫథ్ పేరిట ఆమోదించిన తీర్మానం పై జరిగిన చర్చలో మోదీని ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా నేతల ప్రసంగాలు సాగాయి.
ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.