మోదీ స్టెప్ డౌన్?

Publish Date:Apr 3, 2025

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా? పార్టీ నిబంధనను అనుసరించి తనకు 75 సంవత్సరాలు నిండగానే ప్రధాని పదవి నుంచి స్టెప్ డౌన్ అవుతారా? ప్రధాని మోడీ తనకు తాను ఆ నిబంధనను వర్తింప చేసుకుంటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.  ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 75 ఏళ్ల పరిమితి నిబంధన మేరకే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల చేత పొలిటికల్ రిటైర్మెంట్ చేయించారు.  మరి ఇప్పుడు అదే నిబంధన మేరకు మోడీ తనంత తానుగా రాజకీయాలకు దూరమౌతారా? అన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క ొనసాగుతోంది.  శివసేన (ఉద్ధవ్ ధాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ అయితే త్వరలోనే మోడీ వారసుడు రాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని నరేంద్రమోడీ  ఇటీవల అంటే గత ఆదివారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి కారణం అదేనని ఆయన అంటున్నారు. 
మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రారంభోత్సవమనో, మరోటనో కారణాలు చెప్పి ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం తన పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించడానికేనని సంజయ్ రౌత్ గట్టిగా చెబుతున్నారు.  మొత్తం మీద సంజయ్ రౌత్ మోడీ స్టెప్ డౌన్ పై ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశంలో రాజకీయ హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు.  మోడీయే 2029లో కూడా ప్రధానిగా ఉంటారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రధానిగా మోడీ యాక్టివ్ గా ఉన్నారనీ, అటువంటి సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటంతో అర్ధం లేదనీ ఫడ్నవీస్ అంటున్నారు.  ప్రధాని మోడీ నాగపూర్ ఆర్ఎస్ఎష్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన రాజకీయ వారసుడికి సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదనీ, అసలా ప్రస్తావనే రాలేదనీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  

అయితే ఏడున్నర పదుల వయస్సు నిండిన నేతల రాజకీయ విరమణ అంశంపై బీజేపీలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలెవరికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం ఇసుమంతైనా లేదు. గతంలో  అడపాదడపా పార్టీ నాయకుడు ఎలా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు ఆయన నాయకత్వం మార్పుపై కానీ, 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విషయంపై కానీ మాట్లాడే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

ఇప్పుడు పార్టీలో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.  నితిన్ గడ్కరీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లలో ఎవరో ఒకరు మోడీ తరువాతి స్థానం అంట నంబర్ 2లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఆ నంబర్ 2 యే మోడీ వారసుడన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పుడే కాదు. మోడీ రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఆయన పోటీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, షా ద్వయం యోగి పట్ల అంత సదభిప్రాయంతో లేరనీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అదే కారణంతో ఆర్ఎస్ఎస్ మాత్రం యోగికి మద్దతుగా నిలబడుతోందని అంటున్నారు. 

హిందుత్వ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ప్రచారం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. అంతే కాకుండా తనదైన ప్రత్యేక   శైలితో శాంతి భద్రతలను పరిరక్షించడం ద్వారా యోగి పార్టీ నేతలు, క్యాడర్ నుంచి గట్టి మద్దతు సాధించారనీ అంటున్నారు.  అన్నిటికీ మించి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వచ్చారు. పలు సందర్భాలలో య ోగి తాను పదవులు ఆశించననీ, యూపీ సీఎంగా తనది పార్ట్ టౌం జాబ్ మాత్రమేనని పలు సందర్భాలలో యోగి చెప్పారు.  

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.