Publish Date:Mar 16, 2026
మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లేక అయోమయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానవు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఇప్పటి వరకూ విజయం సాధించింది లేదు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి అది వేరే సంగతి. ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులపై మాత్రం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికలలో ఆయన తొలి సారిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికలలో జనసేన కూడా ఏమంత ప్రభావం చూపకపోవడంతో నాగబాబు పరాజయం పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. జనసేన అధినేత సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత అయి ఉండి కూడా ఆయనకు పోటీకి అవకాశం దక్కకపోవడం అప్పట్లో రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. అది పక్కన పెడితే.. 2025 ఏప్రిల్ లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు.
అయినా ఎమ్మెల్సీ అయ్య దాదాపు ఏడాది కావస్తున్నా నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఇక ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో జనసేనాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాలిస్తే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి నేతగా నాగబాబు నిలుస్తారు. ఇక ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.
అదలా ఉండగా నాగబాబు ప్రస్తుతం తన దృష్టినంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపై కేంద్రీకృతం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల వేదికగా నాగబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జనసేన వర్గాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తత టర్మ్ లో ఆయన ఏపీ కేబినెట్ లో చేరుతారా? లేక రాజ్యసభకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటారా? అన్న చర్చల నడుమ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎచ్చర్ల నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం నాగబాబు రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయన్న ప్రశ్నకు తావిస్తోంది. ఎచ్చర్లలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన ఎచ్చర్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించినా.. ప్రస్తతం ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఆ సీటును నాగబాబు కోసం త్యాగం చేస్తుందా? అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ఒకే సమయంలో మూడు రకాల ప్రయత్నాలు చేయడం ఆయనలోని కన్ఫ్యూజన్ ను బయటపెట్టడమే కాకుండా జనసేన వర్గాలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద నాగబాబు ది రాజకీయ వ్యూహమా లేక అయోమయమా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన వర్గీయులే అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nagababu-politicsstrategyor-confusion-25-215585.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.