పెద్దిరెడ్డిపై నాగబాబు ఫైర్.. ఓ రేంజ్ లో ఉందిగా!

Publish Date:Feb 3, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ లో అత్యంత కీలక భాగస్వామి జనసేన అనడంలో సందేహం లేదు. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా జనసేన త్యాగాలకు సిద్ధపడి అన్ని స్థానాలలోనే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీసీ సర్కార్ ఎన్నికలలో పరాజయం కావడానికి జనసేన చొరవ తీసుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, బీజేపీని కూడా పొత్తులోకి తీసుకురావడం కూడా ఇక కారణం. ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఇప్పుడు జనంలో మమేకం కావడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా జనసేన పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హాజరయ్యారు. అసలు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపించనున్నట్లు  జనసేన వర్గాలు చెబుతున్నాయి.  

పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అయిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా పుంగనూరు సమావేశంలో నాగబాబు విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక అడవి దొంగగా అభివర్ణించారు. మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటన వెనుక కుట్ర ఉందని.. ఆ కుట్రదారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

పుంగనూరు పుడింగిగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గాలు, దురాగతాలపై తనకు వివరించిన స్థానికులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తనకు సూచించారని చెప్పిన నాగబాబు తనకు భయం లేదని చెప్పారు. పెద్దిరెడ్డి కాదు.. వైసిపీ అధినేత జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా తాను భయపడలేదనీ, ఆఫ్ట్రాల్ పెద్దిరెడ్డి ఎంత అని అన్నారు. నీతిగా, నిజాయతీగా ఉండే వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న నాగబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన క్యాడర్, లీడర్ అందరూ కూడా నీతి మార్గాన్నే అనుసరిస్తారన్న పవన్ కల్యాణ్ అందుకే జనసేన పార్టీకి భయమన్నదే లేదని ఉద్ఘాటించారు.

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డిపై విమర్శల దాడిని ఉధృతం చేసిన నాగబాబు  గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. జనం ఓడించిన తరువాత ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాలేదనీ, ప్రజలకు మొహం చాటేసి భయంభయంగా నక్కినక్కి బతుకీడుస్తారని ఎద్దేవా చేశారు. జగన్ కే కాదు జగన్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీకి హాజరై ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం లేదని నాగబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన సాగిస్తోం దన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా చేస్తోందన్నారు. పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్ సర్కార్ కు నాలుగేళ్లు పడితే.. ఎన్డీయే కూటమి సర్కార్ ఆ పని ఒకే సారి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ కూటమి సర్కార్ అమలు చేస్తుందనీ, ఒక్కటొక్కటిగా ఒక్కో హామీనీ నెరవేరుస్తూ వస్తోందని చెప్పారు.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.