Publish Date:Apr 20, 2024
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.. దేశం నాకు చాలా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే
మనుషులోయ్ అనే మాట మాత్రం ఆలోచించరు. దేశమంటే మరెవరో కాదు.. దేశమంటే మనమేనని అర్థం చేసుకోరు. దేశం మనకి చాలా ఇచ్చింది. ఆఫ్రికా దేశాలనో, ఎడారి దేశాలనో చూస్తే
మనకి అర్థమవుతుంది.
మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం కూడా ఏమైనా ఇవ్వాలి.. దేశం నాకేమిచ్చింది అని కాకుండా.. దేశానినేనేమిచ్చాను? దేశానికి నేనేమివ్వాలి అని ఆలోచించాలి. అనిపిస్తోందా?
దేశానికి ఏమైనా ఇవ్వాలని మీకనిపిస్తోందా? అయితే, దేశానికి మీరివ్వాల్సింది ఏమిటంటే, దేశం మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, ఐదు నిమిషాలు.. ఎస్.. ఐదంటే ఐదు నిమిషాలు.. రీల్స్
చూడడ్డానికి గంటలు గంటలు వినియోగిస్తాం. అలాంటిది దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా? ఇప్పుడు మీకు దేశం కోసం ఐదు నిమిషాలను ఇవ్వాలని అనిపిస్తోందా? అయిదు
నిమిషాలు కాదు.. పదినిమిషాలు ఇస్తాం.. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి అనిపిస్తోందా? అయితే అది ఎక్కడ ఇవ్వాలో మేము చెప్పం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్
చెబుతున్నారు చదవండి.
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికలలో ఓటు వేయడం
పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికి, మన దేశం కోసం ఓటు వేయడానికి ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడానికి
వీలవుతుంది కదా! ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ ఆనందాన్ని ఓటు వేసిన
ప్రతిసారీ పొందుతూ వుంటాను’’.... భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘మై ఓట్.. మై వాయిస్’ మిషన్లో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఇలా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-vote-my-voice-39-174213.html
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.