Publish Date:Apr 20, 2024
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.. దేశం నాకు చాలా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే
మనుషులోయ్ అనే మాట మాత్రం ఆలోచించరు. దేశమంటే మరెవరో కాదు.. దేశమంటే మనమేనని అర్థం చేసుకోరు. దేశం మనకి చాలా ఇచ్చింది. ఆఫ్రికా దేశాలనో, ఎడారి దేశాలనో చూస్తే
మనకి అర్థమవుతుంది.
మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం కూడా ఏమైనా ఇవ్వాలి.. దేశం నాకేమిచ్చింది అని కాకుండా.. దేశానినేనేమిచ్చాను? దేశానికి నేనేమివ్వాలి అని ఆలోచించాలి. అనిపిస్తోందా?
దేశానికి ఏమైనా ఇవ్వాలని మీకనిపిస్తోందా? అయితే, దేశానికి మీరివ్వాల్సింది ఏమిటంటే, దేశం మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, ఐదు నిమిషాలు.. ఎస్.. ఐదంటే ఐదు నిమిషాలు.. రీల్స్
చూడడ్డానికి గంటలు గంటలు వినియోగిస్తాం. అలాంటిది దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా? ఇప్పుడు మీకు దేశం కోసం ఐదు నిమిషాలను ఇవ్వాలని అనిపిస్తోందా? అయిదు
నిమిషాలు కాదు.. పదినిమిషాలు ఇస్తాం.. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి అనిపిస్తోందా? అయితే అది ఎక్కడ ఇవ్వాలో మేము చెప్పం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్
చెబుతున్నారు చదవండి.
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికలలో ఓటు వేయడం
పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికి, మన దేశం కోసం ఓటు వేయడానికి ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడానికి
వీలవుతుంది కదా! ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ ఆనందాన్ని ఓటు వేసిన
ప్రతిసారీ పొందుతూ వుంటాను’’.... భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘మై ఓట్.. మై వాయిస్’ మిషన్లో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఇలా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-vote-my-voice-25-174214.html
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.