మతఘర్షణల నుండి లబ్ది కోసం రాజకీయ పార్టీల ఆరాటం

Publish Date:Sep 16, 2013

Advertisement

 

ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ మత ఘర్షణలలో అధికారిక లెక్కల ప్రకారం 45మంది ప్రజలు చనిపోగా దాదాపు 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సమాచారం. అయితే నిజానికి ఈ సంఖ్య ఇంత కంటే చాలా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మత ఘర్షణలు వలన ఇంత మంది అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులవుతుంటే, భాద్యతగా మెలగవలసిన ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ దురదృష్ట సంఘటనల నుండి లబ్దిపొందేందుకు చేస్తున్ననీచ రాజకీయాలను చూసి అక్కడి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు.

 

స్థానిక బీజేపీ నేత ఒకరు మత ఘర్షణలకు సంబందించి ఒక నకిలీ వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టడంతో అల్లర్లు మరింత పెరిగాయని అధికారిక సమాజ్ వాదీ ప్రభుత్వం ఆరోపించింది. త్వరలో ఐదు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

 

ఈ అల్లర్లలోనష్టబోయిన హిందూ, ముస్లిం ప్రజలను ఓదార్చే మిషతో ఎలాగయినా ఆకట్టుకొని వారి ఓట్లకు గేలం వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఈ రోజు ముజఫర్ నగర్ పర్యటనకు బయలుదేరుతున్నారని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన కంటే ఒకరోజు ముందుగానే అంటే నిన్నఆదివారం నాడే ముజఫర్ నగర్ లో భాదిత కుటుంబాలను పరామర్శకు బయలుదేరారు. కానీ అక్కడి ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని ఆయనకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడంతో అఖిలేష్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని వెనుతిరగవలసి వచ్చింది.

 

ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతున్న మాజీ ముఖ్యమంత్రి మాయావతి మత ఘర్షణలను నివారించడంలో విఫలమయిన అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భారత రాజకీయాలపై పెను ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో పైచేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విషాదకరమయిన ఈ మత ఘర్షణలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

By
en-us Political News

  
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.