పద్మనాభం.. ఉత్తరాల కుమారుడేనా?.. నవ్వుల పాలౌతున్న ముద్రగడ!

Publish Date:Mar 13, 2024

Advertisement

ముద్రగడ పద్మనాభం. రాజకీయాలతో కనీస పరిజ్ణానం ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆ పేరు చిరపరిచితమే. కాపు జాతి ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చేశానని తనకు తాను ప్రకటించుకునే  ముద్రగడ విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత మాత్రం  తాను ఉద్ధరిస్తానని చెప్పుకునే కాపు జాతికి దూరం దాదాపుగా ఆయన అయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారమయ్యారు. ఔను కాపులకు రిజర్వేషన్ల విషయంలో జగన్ కుండబద్దలు కొట్టినట్లు అది సాధ్యమయ్యేపని కాదని తేల్చేసిన తరువాత కూడా పన్నెత్తు మాట అనక పోవడమే కాకుండా.. ఇంకా ఆయననే వెనకేసుకు వస్తూ.. చట్టపరమైన ఇబ్బందులు ఏవీ ఎదురుకాకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన చంద్రబాబును వ్యతిరేకించడమే కాదు, అదే కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు పవన్ కల్యాణ్ నేతగా ఎదుగుతుంటే ఓర్వలేని తనంతో లేఖలు గుప్పించారన్న అభిప్రాయం ఆ సామాజికవర్గ ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.

అసలు   కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మం అంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుకున్న ముద్రగడ తెలుగుదేశం హ‌యాంలో  ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నంత‌కాలం కాపు రిజ‌ర్వేష‌న్లు అంటూ తెగ హ‌డావుడి చేసిన ముద్ర‌గ‌డ, జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఆ ముచ్చటే ఎందుకు ఎత్తలేదని నిలదీస్తున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు రిజ‌ర్వేష‌న్లుకు తాను వ్యతిరేకం అని విస్పష్టంగా ప్రకటించిన జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ముద్రగడ, ఆ ఎన్నికలలో  ఆయనను గెలిపించేందుకు తనవంతు కృషి చేసి.. కాపు రిజర్వేషన్లు అన్నది కేవలం తన సామాజికవర్గంలో పాపులారిటీని పెంచుకునేందుకే అని చెప్పకనే చెప్పేశారని అంటున్నారుప. అంతే కాకుండా జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తరువాత ఇంత కాలం, కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు ఉద్య‌మం ఊసే ఎత్తని ముద్రగడపై   కాపు సామాజిక వ‌ర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.   

అదే సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుండటం, అన్ని వర్గాలకూ న్యాయం అన్న ఉద్దేశంతో సాగుతుండటంతో కాపు సమాజికవర్గం యువత ఆయనవైపు మొగ్గు చూపుతున్నది. దీంతో సహజంగా ఇంత కాలం కాపు నేతగా చెలామణి అయిన ముద్రగడకు ఈ పరిణామం నచ్చలేదు. దీంతో ఇప్పటి వరకూ కప్పుకున్న ముసుగు తొలగించి కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించిన జగన్ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. తనకు కాపు సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని భావించిన ముంద్రగడ.. తాను జగన్ పార్టీలో చేరుందుకు తాడేపళ్లికి భారీ ర్యాలీలో వెడతానని ప్రకటించి, కనీసం పది వేల మంది తమ సొంత వాహనాల్లో ఆ ర్యాలీలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు.

ఉత్తరాలు రాయడంలో దిట్ట అయిన ముద్రగడ ఆ విషయం కూడా ఒక బహిరంగ లేఖ రూపంలోనే ఇచ్చారు. అయితే ఆయన ఊహలు తల్లక్రిందులయ్యాయి. ఆయన వైసీపీలో చేరే సందర్భంగా ర్యాలీగా ఆయన వెంట రావడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ పిలుపు ఉపసంహరించుకోకుంటే అభాసుపాలు కావడం ఖాయమని గ్రహించిన ముద్రగడ.. ఆ పిలుపు ఉపసంహరణతో పాటు వైసీపీ చేరిక ముహూర్తాన్ని సైతం మార్చేసుకున్నారు. 

భారీ సంఖ్యలో మద్దతుదారులతో వెళ్లడం ముఖ్యమంత్రి భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందన్న సమాచారంతో తాను ర్యాలీని విరమించుకున్నాననీ, తాను ఒక్కడినే, ఒంటరిగా తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాననీ ఓ  బహిరంగ లేఖ రాసేశారు. ర్యాలీకి మీ ఏర్పాట్లు మీరే చేసుకుని పెద్ద సంఖ్యలో తరలిరండి అంటే లేఖ రాసిన రోజుల వ్యవధిలోనే ఎవరూ రావద్దు ఒంటరిగానే వెడతానంటూ ముద్రగడ రాసిన లేఖ నవ్వు పుట్టించడమే కాకుండా ఆయనను నవ్వుల పాలు కూడా చేసేసింది. అంతా కాదు ఇంకా ఆయనను నమ్ముతున్న అతి కొద్ది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారికి ముద్రగడ వెనుక ఎవరూ లేరన్న విషయాన్నీ తేటతెల్లం చేసేసింది.  అన్నిటికీ మించి జనంలోకి రాకుండా కేవలం లేఖలద్వారా పాపులారిటీ కోల్పోకుండా చూసుకోవచ్చన్న ఆయన ఎత్తుగడ.. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలలో నవ్వులు పూయిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత హ్యూమర్ ను పూర్వపక్షం చేసేసి మాంఛి కామెడీ పండిస్తోంది.  

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.