ముద్ర‌గ‌డకు పవన్ ఫోబియా.. అందుకే వైసీపీలోకి?

Publish Date:Mar 7, 2024

Advertisement

కాపు నేత‌గా చ‌లామ‌ణి అవుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు భ‌యం ప‌ట్టుకుందా?  ప‌వ‌న్ బ‌లోపేతం అయితే త‌న నాయ‌క‌త్వానికి ఎసరు వస్తుందన్న ఆందోళ‌న‌లో ఉన్నారా? అందుకే వైసీపీలో చేరి  ఉనికి కాపాడుకోవాలని తాపత్రేయపడుతున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఏపీలో మెజార్టీ కాపులు ముద్ర‌గ‌డ‌ను త‌మ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా భావించేవారు. ఆయ‌న నిర్ణ‌యాల‌ను గుడ్డిగా ఫాలోఅయ్యేవారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది కాపు యువకులపై కేసులు కూడా న‌మోద‌య్యాయి.  అనేక మంది  జైళ్ల‌కు  వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. అయితే అలాంటి గుడ్డి నమ్మకం ఎల్లకాలం ఉండదని ఇటీవలి పరిణామాలు రుజువు చేశాయి. పోనీ ఇంత కాలం కాపు పెద్దగా చెలామణీ అవుతూ వచ్చిన ముద్రగడ  కాపు సామాజిక‌వ‌ర్గానికి  చేసిన మేలు ఏమైనా ఉందా అంటూ లేద‌నే  కాపు యువత ఇప్పుడు గట్టిగా చెబుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్లు, కాపు నేత‌ను సీఎంగా చూడాల‌న్న ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు అందుకోసం కంకణం కట్టుకున్నానని చెప్పుకున్న ముద్రగడ వంటి వారిని నమ్మారు. అందుకే వారు ఏం చెబితే అది గుడ్డిగా చేశారు. అయినా వారి ఆశ‌లు మాత్రం నెర‌వేర‌  లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ముద్ర‌గ‌డ లాంటివారేన‌న్న అభిప్రాయం ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి ఇప్పుడు బలంగా వ్య‌క్త‌మ‌వుతోంది. మేమే సామాజిక వ‌ర్గానికి పెద్ద‌లుగా ఉండాలి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో మేం ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిస్తే కాపులంద‌రూ ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేయాల‌నే భావ‌న కార‌ణంగా ఏపీలో కాపులు ఇంకా కాపుకాసే వారిగానే మిగిలిపోతున్నార‌న్న చ‌ర్చ‌సైతం ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల్లో జరుగుతోంది.

పాము త‌న పిల్ల‌ల‌ను తానే తింటుంద‌న్న సామెత ముద్ర‌గ‌డ వ్య‌వ‌హారంలో నిరూపిత‌మ‌వుతోంద‌ని రాజకీయ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో కాపు నేతను సీఎంగా చూడాల‌న్న‌ది ఆ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల కోరిక‌. గ‌తంలో చిరంజీవి ఆ ప్ర‌య‌త్నంలో ఓట‌మి పాలయ్యారు. ఆ స‌మ‌యంలో కాపు సామాజిక వర్గంలోని కొంద‌రు నేత‌లే  ఆయ‌న ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న ప్ర‌చారం  జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంచెలంచెలుగా రాజ‌కీయాల్లో ఎదుగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీచేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ .. పార్టీని న‌డుపుతూ ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా కొన‌సాగుతున్నారు. రాబోయే కాలంలో జ‌న‌సేన పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతంచేయాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌. ఆ దిశగా ఆయ‌న అడుగులు పడుతున్నాయి. గ్రామ‌ స్థాయిలో పార్టీకి పునాదులు లేకుండా సీఎం కుర్చీ కావాలంటే అది అత్యాశే అవుతుంది. ఈ విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా తెలుసు. అందుకే ఆయ‌న ఒక్కో అడుగు ముందుకువేస్తూ పార్టీ బ‌లాన్ని పెంచుకుంటున్నారు.  

తాజాగా టీడీపీతో పొత్తుతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 20మందికి త‌గ్గ‌కుండా జ‌న‌సేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. దీనికితోడు.. ఏపీలో అభివృద్ధి మ‌రిచి, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గ‌ద్దెదించేందుకు ప‌వ‌న్  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు  ప‌వ‌న్ దూకుడుకు కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా కాపు సామాజిక వ‌ర్గం పెద్ద‌గా పేరున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అడుగులు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికి వైసీపీ ఎంపీ, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ మిథున్ రెడ్డి  వెళ్లి ఆయ‌న్ను వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్ర‌గ‌డ సైతం వైసీపీలోకి చేరేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు స‌మాచారం. దీంతో ముద్ర‌గ‌డ‌కు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ టాస్క్ సిద్ధం చేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ర‌పున‌ ప్ర‌చారం చేయాల‌ని జగన్ ముద్రగడను ఆదేశించినట్లు చెబుతున్నారు.   అందుకు ముద్ర‌గ‌డ‌ ఓకే అన్నారని కూడా చెబుతున్నారు.  దీంతో..  కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా తనను తాను ప్రకటించుకున్న ముద్ర‌గ‌డ‌తోనే కాపు సామాజిక వ‌ర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్న  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెక్ పెట్టేలా జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

వ‌చ్చేఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన  పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీ 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, మూడు పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణ‌యించింది. ముద్ర‌గ‌డ‌, హ‌రిరామ జోగ‌య్య లాంటివారు కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌లు మాట్లాడుతూ.. కేవ‌లం 24 సీట్లేనా? 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలి.. 24 స్థానాల కోసమే అయితే తెలుగుదేశంతో  పొత్తు ఎందుకు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల‌తో క‌లిసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముద్ర‌గ‌డ లాంటి నేత‌లు వైసీపీ కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నార‌ని గుర్తించిన ప‌వ‌న్.  బ‌హిరంగ స‌భ వేదిక‌పైనే వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ముద్ర‌గ‌డ వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైసీపీలో చేరి కాపులంద‌రినీ వైసీపీ వైపుకు మ‌ళ్లించి ప‌వ‌న్ తో పాటు జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డ‌మే ముద్ర‌గ‌డ టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తోపాటు జ‌న‌సేన అభ్య‌ర్థులు అత్య‌ధిక  స్థానాల్లో ఓడిపోతే.. కాపు ఉద్య‌మ నేత‌గా, కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌గా త‌న మున‌గ‌డ‌కు ఎలాంటి ప్ర‌మాదం  ఉండ‌ద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం భావిస్తున్నార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతుంది. 

అయితే, ముద్ర‌గ‌డ ఎత్తుగ‌డ‌ను కాపుల్లోని మెజార్టీ ప్ర‌జ‌లు గుర్తించార‌ని, ఈసారి ముద్ర‌గ‌డ‌కు గుణ‌పాఠం చెప్పి.. ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు కాపు సామాజిక వ‌ర్గం  నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి కాపు సామాజిక వ‌ర్గం పెద్దగా.. అదే సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఓడించే ప్ర‌య‌త్నంలో ముద్ర‌గ‌డ ఘోరంగా విఫలం అవుతారని అందులో అనుమానమే లేదనీ అంటున్నారు. 

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.