గాంధీ మెచ్చిన సుబ్బులక్ష్మి స్వరం

Publish Date:Sep 16, 2016

Advertisement

 

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జీవితాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం, సాగరాన్ని గుప్పిట్లో బంధించడంలాంటిది. కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా, భక్తి సంగీతానికి నిర్వచనంగా నిలిచిన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి సందర్భంగా ఆమె ప్రతిభను చాటే ఒక ఉదంతాన్ని తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తన పదకొండవ ఏట నుంచే సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆమె చేసే ఒకో సంగీత కచేరీతో ఆమె గాత్ర మాధుర్యం లోకమంతా విస్తరించడం మొదలైంది. ఇక 1947లో హిందీలో వచ్చిన మీరాబాయి చిత్రంలో ఆమె పాడిన భజనలతో ఎమ్మెస్‌ దేశవ్యాప్తంగా సంగీతసంచలనంగా మారిపోయారు. ఆ చిత్రంలో ఎమ్మెస్‌ పాడిన పాటలకు ముగ్ధులైపోయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేను కేవలం ఒక ప్రధానమంత్రిని మాత్రమే! సంగీతానికి రాణి అయిన ఆమె ముందు నేనెంత?’ అనేశారు.

 

ఇంచుమించు అదే సమయంలో సుబ్బులక్ష్మి భర్త సదాశివంగారికి గాంధీగారి నుంచి ఒక ఫోన్‌ వచ్చింది. బహుశా గాంధీగారు మీరాబాయి చిత్రంలోని పాటలను విన్నారో ఏమో... తనకు ఇష్టమైన ఒక మీరాబాయి భజనను ఎమ్మెస్‌ గాత్రంలో వినాలని ఉందని ఆయన కోరారు. అయితే ఎమ్మెస్‌ ఆ కోరికను సున్నితంగా తిరస్కరించారు. గాంధీగారు కోరుకుంటున్న ఆ భజన తనకు అంతగా పరిచయం లేదనీ, దానికి తాను న్యాయం చేయలేననీ ఎమ్మెస్ భయం. అయితే ఆ సాయంత్రం నేరుగా గాంధీగారి నుంచే మరో ఫోను వచ్చింది. ఎమ్మెస్ ఆ భజనను పాడాల్సిన అవసరం లేదనీ, కనీసం ఆమె దానిని చదివినా తనకు తృప్తిగా ఉంటుందనీ ఆయన అన్నారు. గాంధీగారు అంతగా కోరుకోవడంతో, రాత్రికిరాత్రే ఎమ్మెస్‌ ఆ భజనను రికార్డు చేసి దిల్లీకి పంపారు.

 

ఈ ఘటన జరిగిన కొద్ది నెలల తరువాత ఎమ్మెస్ ఒక రోజు రేడియోలో వార్తలను వింటున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. గాంధీని అత్యంత దారుణంగా కాల్చి చంపిన రోజు. రేడియోలో ఆ వార్తని వింటూనే ఎమ్మెస్ మ్రాన్పడిపోయారు. ఆ వార్తని వినిపించిన వెంటనే రేడియోలో తాను గాంధిగారి కోసమని పాడిన మీరా భజన ప్రసారం అయ్యింది. ఆ భజన వినడంతోనే ఎమ్మెస్ స్పృహ కోల్పోయారు. ఆ తరువాత కాలంలో ఎమ్మెస్‌ తరచూ ఈ సంఘటనలన్నింటినీ కన్నీటితో గుర్తుచేసుకునేవారట.

 

గాంధీ అంతటివారు అంతగా కోరి పాడించుకున్న ఆ భజన ‘హరి తుమ్‌ హరో’ (hari tum haro). యూట్యూబ్‌లో ఆ భజనని ఎవరైనా వినవచ్చు. దేశాన్ని నడిపించే నేతలైనా, ప్రపంచాన్ని నడిపించే నాయకులైనా... కళలకు కరిగిపోక తప్పదని ఈ ఉదంతం నిరూపిస్తుంది. ఎవరితోనైనా చివరివరకూ తోడుగా నిలిచేది ఆ కళే అని చాటి చెబుతోంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.