వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్ లో ఆ ఎంపీ పాత్ర?

Publish Date:Oct 20, 2022

Advertisement

మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్న సీబీఐ అధికారులను నిందితులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సీబీఐ స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు డీ. శివశంకర్ రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలోని కోర్టులో హాజరుపరిచినప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో పాటు కోర్టు గదిలోకి ప్రవేశించి, రిమాండ్ లాంఛనాలు పూర్తిచేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నార’ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలపడంతో  వివేకా కేసులో మరో సంచలన విషయం బయటపడినట్లైంది.

ఈ హత్య కేసులోని నిందితులు శక్తిమంతులని, సాక్షులను బెదిరిస్తూ విచారణను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని, అందువల్ల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి,  భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా సీబీఐ వేసిన అఫిడవిట్ లో ఈ విషయం స్పష్టం చేసింది. సీబీఐ విచారణ అధికారులను ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుకున్న వైనాన్ని పూసగుచ్చినట్లుఆ అఫిడవిట్ లో వెల్లడించింది. వివేకా హత్య కేసులోని సాక్షులు, సీబీఐ అధికారులకు ఏపీలో ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా అక్కడ విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనిపించడంలేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.  అందుకే వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలే చేసేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

‘ఆ రోజున అవినాశ్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. వివేకా హత్య కేసులో ఏ5 శివశంకర్ రెడ్డికి మద్దతు పలికారు. శివశంకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. అక్కడే శివశంకర్ రెడ్డితో కూడా మాట్లాడారు. సీబీఐ బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో అవినాశ్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో స్పష్టం చేయడం గమనార్హం. ‘శివశంకర్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అతనిని కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాని గురించి 2021 నవంబర్ 25న పులివెందుల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు.  జైలు అధికారుల తీరును తప్పుపట్టారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో వెల్లడించింది. ‘వివేకా హత్య కేసులో సాక్షి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. మరో సాక్షి గంగాధరరెడ్డి కూడా చనిపోయాడు. గంగాధరరెడ్డి మరణాన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు’ అని కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన 278 పేజీల అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం.

సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన అఫిడవిట్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని స్పష్టంగా పేర్కొనడంతో వివేకా హత్య కేసు వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి మరణం వెనక ఉన్న కీలక సూత్రధారులను బయటపెట్టాలంటూ తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఒక సమాధానం లభించినట్లయిందని అంటున్నారు. తన తండ్రిని దారుణంగా చంపిన, చంపించిన వారిని వదిలిపెట్టేది లేదంటూ సునీతారెడ్డి ఒక విధంగా యుద్ధమే చేస్తున్నారంటున్నారు. మాజీ  సీఎం వైఎస్సార్ కు స్వయంగా తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చడం వెనుక మరిన్ని పెద్ద తలలే ఉన్నాయనే అనుమానాలకు సీబీఐ సుప్రీంలో ఇచ్చిన అఫిడవిట్ మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు.

వివేకా హత్య  వెనుక బలమైన అదృశ్య శక్తులు కీలకంగా ఉన్నందువల్లే సంఘటన జరిగి మూడేళ్లయినా దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటున్నారు. వివేకా హత్య కేసు విచారణ నిష్పాక్షికంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని.. ధర్మాసనం సభ్యుడు జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించడం కూడా కేసు వెనుక ఎంతటి బలమైన శక్తులు పనిచేస్తున్నాయో అర్థం అవుతోందంటున్నారు. నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ఏపీలో కాకుండా ఢిల్లీ, తెలంగాణలలో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని నిందితుల తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు.

By
en-us Political News

  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.