వాక్ స్వాతంత్ర్యం... మదర్ థెరిసా కంటే గొప్పదా?

Publish Date:Sep 6, 2016

Advertisement

ఈ మద్య కాలంలో పదే పదే వినిపిస్తోన్న అత్యంత వివాదాస్పదమైన అంశం భావ ప్రకటనా స్వాతంత్ర్యం! అది వుందని కొందరు దుర్వినియోగం చేస్తే లేదని కొందరు చాలా బాధపడిపోతుంటారు! మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఎలాగో ఒకలా వివాదాలకి కారణం అవుతూనే వుంది! రీసెంట్ గా తన వాక్ స్వాతంత్ర్యాన్ని ఇష్టానుసారం వాడిన వివాదాస్పద వ్యక్తి.... మార్కండేయ కట్జూ!. మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అనగానే మనకు బోలెడు వివాదాలు గుర్తుకు వస్తాయి. ఆయన ఏం మాట్లాడినా వివాదమే. ఇక ఆయన సోషల్ మీడియాలో పోస్టులు దంచుకున్నాడంటే మరింత రచ్చే! ఈ సారి ఆయన టార్గెట్ మదర్ థెరిసా అయింది!.


మార్కేండయ కట్జూ ఫేస్బుక్ లో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టాడు. దాని సారాంశం ఏంటంటే, మదర్ థెరిసాకు సెయింట్ హుడ్ ఇవ్వటం గురించి అందరూ ఎందుకు హంగామా చేస్తున్నారని! అక్కడితో ఆగిపోతే బాగానే వుండేది. కాని, ఆయన మదర్ కు వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. అనేక సాక్ష్యాలతో మదర్ థెరిసా ఒక క్యాథలిక్ ఛాందసవాది అని నిరూపించే ప్రయత్నం చేశాడు! దీనికి నెటిజన్స్ నుంచి రియాక్షన్ ఎలా వుంటుంది అనుకుంటున్నారు? ఊహించినట్టుగానే నానా రభసా అయింది! మదర్ థెరిసా... కట్జూ చెప్పినట్టు క్రిస్టియన్ మిషనరీయా, మత వ్యాప్తికి ప్రయత్నించిందా, ఆమెకు వచ్చిన విరాళాలు ఎక్కడివి, ఆమె భావజాలం మధ్య యుగాల నాటి కరుడుగట్టిన చాందసమా... ఇలాంటివన్నీ ఎప్పుడూ వుండేవే! పైగా అవి వివాదాస్పదం కూడా! కాని, ఇక్కడ ఒక్కటే విచిత్రంగా వుంటోంది... అదే సో కాల్డ్ లిబరల్స్ అని చెప్పుకునే అభ్యుదయవాదుల వాదన!


మదర్ థెరిసా గురించి ఎవ్వరు ఏ విమర్శ చేసినా ఆమెని అభిమానిస్తామని చెప్పుకునే కొందరు తీవ్రమైన దాడి మొదలు పెడుతున్నారు. అసలు మదర్ థెరిసాను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదని వారు తేల్చేస్తున్నారు! ఆమె పేదలకు నిస్వార్థంగా సేవ చేసింది కాబట్టి ఏమీ అనకూడదంటారు! ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే వారు ఎవ్వరూ దీనికి అంగీకరించరాదు! ఎందుకంటే, మతాన్ని, దేవుడ్ని కూడా విమర్శించటమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఆదునిక అభిప్రాయం. మరి అలాంటప్పుడు మదర్ థెరిసా కూడా విమర్శకు అతీతురాలు కాదు కదా!


మార్కండేయ కట్జూ తన సుదీర్గమైన పోస్ట్ లో మదర్ థెరిసాను అనేక విధాల ప్రశ్నించాడు. ఆమె నోబుల్ ప్రైజ్ తీసుకుంటూ అబార్షన్లు ప్రపంచ శాంతికి చేటు చేస్తాయని అన్నారంటూ గుర్తు చేశాడు! ఇది చాందసవాదం తప్ప మరేం కాదని తేల్చేశాడు! ఇక వాటికన్ మదర్ కు సెయింట్ హుడ్ ఇవ్వటానికి ఒక అద్భుతం జరిగిందని అంగీకరించింది. బెంగాల్ లోని ఒక మహిళ మదర్ ఫోటో లోంచి ఒక మెరుపు వచ్చి తన ఒంట్లోకి ప్రవేశించిందని చెప్పింది. వెంటనే తనకున్న క్యాన్సర్ పోయిందని ఆమె తెలిపింది. దీన్ని గుడ్డిగా నమ్మిన వాటికన్ మదర్ థెరిసాకు సెయింట్ గౌరవం ఇచ్చేసింది.

 

అసలు సదరు పేషంట్ కి క్యాన్సర్ లేనే లేదని ఆమె డాక్టర్ చెప్పాడట! కాని, పోప్ డాక్టర్ మాటలు పట్టించుకోలేదు! ఇదంతా మూఢ నమ్మకం అంటాడు కట్జూ! మీడియా కూడా కావాలనే మదర్ గురించిన అనేక అనుమానాల్ని పట్టించుకోకుండా వదిలేసిందని ఆయన ఆరోపించాడు!. అసలు మదర్ థెరిసాకు విరాళాలు ఎక్క్డడ్నుంచి వచ్చాయని కూడా మార్కండేయ కట్జూ ప్రశ్నించాడు. ఎలాంటి దుర్మార్గులు డబ్బులిచ్చినా ఆమె విరాళంగా స్వీకరించిందని అన్నాడు. ఇంతా చేస్తే వేలాది డాలర్ల చందాలు తీసుకున్న ఆమె తగినంతగా పేదలకు, అనాథలకు, అంతిమ ఘడియల్లో వున్న వారికి చేసిందేమీ లేదని పెదవి విరిచాడు!


మార్కండేయ కట్జూ మదర్ పై చేసిన వ్యాఖ్యల్ని మనం సమర్థించకపోవచ్చు. లేదా పూర్తిగా ఒప్పుకోకపోవచ్చు. కాని, థెరిసా లాంటి ఒక త్యాగమూర్తిని టార్గెట్ చేస్తే మనసు చివుక్కుమంటుంది. కాని, ఆ కారణం చేత మదర్ థెరిసాను ఎవ్వరూ విమర్శించవద్దు, ప్రశ్నించవద్దు అంటే కూడా సబబు కాదు. ఆమెని మనసారా అభిమానించి ఫాలో అయ్యే వారు ఇది అర్థం చేసుకోవాలి. మదర్ థెరిసా ఎంత గొప్పో... సంస్కారవంతమైన భాష, భావం వాడినంత వరకూ... భావ ప్రకటనా స్వాతంత్ర్యం కూడా అంతే గొప్పా! 
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.