Publish Date:Jan 27, 2025
యువగళం పాదయాత్ర తనను ఎంతో మార్చిందనీ, ప్రజా నాయకుడిగా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకునే విషయంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే పాదయాత్రే ఎక్కవ దోహదం చేసిందనీ అన్నారు. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీయే లాంటిదన్నారు
యువగళం పాదయాత్రలో భాగంగా నాడు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానన్నారు. అలాగే జగన్ హయాంలో చట్టాలను ఉల్లంఘించిన నాయకులు, అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని పునరుద్ఘాటించారు. విశాఖలో సోమవారం (జనవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతున్నదనీ, అక్రమాలు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు. జగన్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయనీ, వాటన్నిటినై ఒకే సారివిచారణ చేపట్డడం సాధ్యం కాదన్నారు. జగన్ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాలపై ఏకకాలంలో విచారణ జరిపించాలంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులు సరిపోరని లోకేష్ చెప్పారు.
ఇక దావోస్ పర్యటనలో ఎంవోయూలు లేకపోవడంపై మీడియా ప్రశ్నలకూ లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎంవోయూలు, దావోస్ తో సంబంధం లేకుండానే ఈ ఏడు నెలలలో కూటమి సర్కార్ ఆరు లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమిటో చెప్పగలరా అని నిలదీశారు. ఇక విజయసాయి రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నకు సొంత తల్లి చెల్లినే నమ్మని జగన్ ఎవరినీ నమ్మరని, అవసరం తీరిన తరువాత కరివేపాకులా విసిరి ఆవల పారేస్తారనీ, విజయసాయి రెడ్డిదీ అదే పరిస్థితని బదులిచ్చారు. విజయసాయిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/more-learned-in-padayatra-than-stanford-universaty-39-191920.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!