Publish Date:Feb 27, 2026
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ణతలు తెలిపారు.
కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో తాను టార్గెట్ అయ్యానన్నారు. తాను రాజకీయ బాధితురాలినని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయ పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు ముందు నుంచి మద్దతు తెలిపి వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అప్పట్లో ఈ కేసు విషయంలో తనకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తానన్న కవిత.. ఇప్పటి వరకు తనపై అభాండాలు మోపి.. తనను ప్రజల మధ్య చులకన చేసిన రాష్ట్ర బీజపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత అసలు తనపై కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు. ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత, బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారనీ, ఆ విషయాన్ని ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/moral-victory-for-kalvakuntla-kavitha-25-214760.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.