వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు పార్టీకి దూరం జరగడమో, రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడమో చేశారు. ఇక వేరే మార్గం లేని పలువురు పార్టీలో ఉన్నా తామరాకు మీద నీటిబొట్టు మాదిరి పార్టీ వ్యవహారలలో ఇసుమంతైనా జోక్యం లేకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
గతంలో జగన్ పై చిన్న పాటి విమర్శను కూడా సహించలేమంటూ ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించిన నేతలు కూడా ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలోలా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపితే దానికి మీడియా ముందు చదివేయడానికి రెడీగా ఉన్న నాయకులు వైసీపీలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అదే గతంలో అయితే ఇలాంటి వారి సంఖ్య లెక్కకు మించి ఉండేది.
సరే ప్రస్తుతానికి వస్తే రాజ్యసభలో జగన్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతోంది. ఉన్న 13 మందిలో నలుగురు ఇప్పటికే తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. గతంలోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్లిన వారికి క్యారెక్టర్ లేదంటూ విమర్శించారు. దీనిపై అనూహ్యంగా విజయసాయిరెడ్డి నుంచి స్ట్రాంగ్ రిటార్డ్ వచ్చింది. తనకు క్యారెక్టర్ ఉంది కనుకనే మీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అని ట్వీట్ చేశారు. నా క్యారెక్టర్ సరే మీకు క్యారెక్టర్ ఉందా అని జగన్ ను నిలదీసినట్లుగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఇక విజయసాయి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఆయన కూడా తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని పేర్కొన్నారు. జగన్ తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని పేర్కొన్న మోపిదేవి.. నిజంగా ఒత్తిళ్లకు లొంగిపోయే విడినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడినే కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజనులు జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అడిగి మరీ తిట్టించుకోవడానికే అన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-venkataramana-stromg-counter-to-jagan-25-192517.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.