Publish Date:Jul 14, 2022
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘మంకీపాక్స్’ ఇప్పుడు భారత్ కూ పాకింది. . ఒక పక్కన కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తుండగానే మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 59 దేశాల్లో 8 వేల 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ తో ముగ్గురు మరణించారు. ఇంతవరకు భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదన్న ఊరటకు చెక్ పడింది. దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ గురువారం వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, అతని నుంచి సేకరించిన నమూనాలను వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు వీణా జార్జ్ తెలిపారు. పుణె ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే మంకీపాక్స్ ధ్రువీకరించగలమని మంత్రి పేర్కొన్నారు. వ్యాధి బాధితుడిగా భావిస్తున్న వ్యక్తి యుఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని వీణా జార్జ్ వెల్లడించారు.
మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వైద్య నిపుణుల అబ్జర్వేషన్ లో ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయితే.. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు ఇదే అవుతుంది. ఇంతకు ముందు ఉత్తర ప్రదేశ్ లోని ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు వచ్చాయి. ఆ చిన్నారి నమూనాలను పరీక్షించినప్పుడు ఆమెకు మంకీపాక్స్ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెకు మంకీపాక్స్ లేదని నిర్ధారించారు. తాజాగా లక్షణాలు కనిపించిన కేరళ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయితే.. ఇదే దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా రికార్డులకు ఎక్కుతుంది.
నిజానికి ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇంత వరకు నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 80 శాతం ఐరోపా దేశాల్లోనే కనిపించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జులై 11 నాటికి అమెరికాలో సుమారు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 1958లో పరిశోధన కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడింది. దీంతో ఈ వైరస్ ను మంకీపాక్స్ అని పిలుస్తున్నారు. మంకీపాక్స్ రావడానికి కొద్ది రోజుల ముందు సాధారణంగా జ్వరంతో కూడి ఫ్లూ, తలనొప్పి వస్తాయని, కొద్ది రోజుల తర్వాత ముఖం మీద దద్దుర్లతో మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత చేతులతో పాటు శరీరానికి ఈ దద్దుర్లు వ్యాపిస్తాయని వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ ఇన్ క్యుబేషన్ సమయం 5 నుంచి 21 రోజులు ఉంటుందని వారు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/monkey-pox-virus-detected-in-india-25-139718.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.