గాంధీ చనిపోయారని ఎవరన్నారు!

Publish Date:Jan 30, 2017

Advertisement

జనవరి 30. ఒక ఉన్మాది తూటాలకు గాంధీ బలైపోయిన రోజు. బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగులేని పోరుని సాగించి స్వాతంత్ర్యం సిద్ధించేదాకా నిద్రించని వీరుడు మరణించిన రోజు. గాంధీ చనిపోయి ఇప్పటికీ దాదాపు 80 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఆయన జీవితాన్ని ఒక అద్భుతంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. కరెన్సీ నోట్ల మీద కాకుండా వెలకట్టలేని వ్యక్తిత్వాల మీద ఆయన శాశ్వత ముద్ర ఉండాలని ఆశించేవారున్నారు. ఎందుకంటే...

 

నిరంతర ఆత్మపరిశీలన
మనలో తప్పొప్పులను పరిశీలించుకోకపోతే మార్పు అసాధ్యం. అందుకోసం అహాన్ని పక్కనపెట్టాలి. మనసుని చిత్రీ పట్టాలి. నిష్కర్షగా మనలోని లోటుని మనమే ఎత్తిచూపుకొని, దాన్ని అణచివేయాలి. గాంధి జీవితమంతా ఈ తీరునే గడిచింది. ఎప్పటికప్పుడు తను అనుకున్న విలువల ప్రకారం వ్యక్తిత్వాన్ని మలచుకోవడం వల్లే... ఆయన మహాత్ముడయ్యాడు.

 

మార్పు మనలోనే మొదలవ్వాలి
తాను ఆచరించని ఏ విషయాన్నీ గాంధీ ఇతరులకు బోధించలేదు. అహింస, ప్రకృతి వైద్యం, ఖద్దరు ధారణ, నిరాడంబరత.... ఇలా గాంధీ జీవితమే ఓ బోధగా కనిపిస్తుంది. వ్యక్తి సమాజంలోని అంతర్భాగమే అనీ, ఒకో వ్యక్తీ మారుతున్న కొద్దీ సమాజంలో కూడా మార్పు వస్తుందని నమ్మినవాడు బాపూజీ. ఈ సమాజం బాగుపడదు అని పెదవి విరిచేవారికి ఆయన సాధించిన మార్పే ఒక గుణపాఠం.

 

అహింస
ప్రతి పోరాటానికీ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి హింసతో కూడుకున్నదైతే రెండోది అహింస! పైకి చూసేందుకు హింస సహజసిద్ధమైందిగానూ వీరత్వంగానూ కనిపించవచ్చు. కానీ అహింసతో కూడుకున్న తిరుగుబాటు అత్యంత కష్టమైన పని. రక్తం చిందించకుండానే శాశ్వతమైన పరిష్కారాన్ని అందించేది అహింసామార్గమే. ఇందులో ఇరు వర్గాలవారూ విజేతలే! అందుకే అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం నుంచి ఈనాటి గాంధీగిరి వరకూ అనేక ఉద్యమ రూపాలకు ప్రేరణగా నిలిచింది.

 

పట్టుదల
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.. అంటూ మనకి వేమన పద్యం ఉంది. ఈ సూత్రం గాంధీగారికి సరిగ్గా అన్వయిస్తుంది. ఇతరులు ఎంతగా వ్యతిరేకించినా, విమర్శించినా సరే తను సరైనది అనుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండేవారు. వేరొకరి మెప్పు కోసం తన విలువలని ఏమాత్రమూ వదులుకోలేదు. లండన్ రాజమందిరంలోకి అడుగుపెట్టాల్సి వచ్చినా గోచిపాతతోనే ఉన్నారు.

 

మానసిక దృఢత్వం
క్విట్‌ ఇండియా పిలుపుని ఇచ్చేనాటికి గాంధీ వయసు 73 ఏళ్లు. సగటు భారతీయుడు కృష్ణారామా అనుకుంటూ తన నిష్క్రమణ కోసం వేచి చూస్తుండే వయసది. కానీ గాంధీ తన ఆఖరి ఘడియల వరకూ అనుకున్న లక్ష్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. శరీరం ఎంత దుర్బలంగా ఉన్నా మనసుతో మనుగడ సాగిస్తూనే ఉన్నారు. శారీరిక వైకల్యం చేతనో, వయసు మీద పడుతోందనో, బలవంతుడిని కాదనో... పోరాటస్ఫూర్తిని కోల్పోయే ప్రతి ఒక్కరికీ గాంధి పటాన్ని చూసి తనని తాను చూసుకుంటే చాలు... మనసు దృఢంగా ఉండాలే కానీ, సాధించలేనిది ఏదీ లేదని తేలిపోతుంది. 

 

- నిర్జర.

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.