ప్రధాని మోడీతో తమిళిసై భేటీ.. కారణమదేనా?

Publish Date:Jul 4, 2022

Advertisement

పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో  చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని  ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం    గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే   గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ  పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న  చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి.  అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఇది పూర్తిగా ముఖాముఖీ భేటీ. అధికారులు కానీ, పార్టీ నేతలు కానీ లేరు. ఇక్కడే వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో మరీ ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వారిరువురి భేటీలో పూర్తిగా తెలంగాణ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా కేసీఆర్ పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతలు, కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై కొన్ని నివేదకలను మోడీకి అందించినట్లు చెబుతున్నారు. దీంతో వీరురువురి మధ్యా జరిగిన చర్చలపై తెరాసలో ఉత్కంఠ పీక్స్ కు వెళ్లింది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన నేపథ్యంలో మోడీతో భేటీలో గవర్నర్ తమిళసై కేసీఆర్  సర్కార్ పై మోడీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కీలక అంశాలపై నివేదికలు కూడా సమర్పించి ఉంటారన్న భావన అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది.  

మామూలుగా అయితే  ప్రధాని, గవర్నర్ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై- మోడీ భేటీ మాత్రం ఎనలేని రాజకీయ ప్రధాన్యత  సంతరించుకుంది. అందుకు కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితే కాకుండా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య ఉన్న రిఫ్ట్ కూడా ఒక కారణం. గతంలో తమిళిసై ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని, హెంమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గవర్నర్ పర్యటనలలో మంత్రులు, అధికారులూ ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర నుంచి.. అడిగిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదన్న వరకూ తమిళసై కేంద్రానికి నివేదించారు.

ఇక ప్రస్తుతం కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయం వేడెక్కిన తరుణంలో తమిళిసైతో మోడీ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన కేసీఆర్ ఇటీవలి  ప్రయత్నాలు విఫలమైనా   జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఆలోచనలతో మోడీపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో.. మోడీ ప్రత్యేకంగా గవర్నర్ తమిళపైతో  40 నిముషాల పాటు ముఖాముఖి చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళసై చెప్పిన అంశాలు, అందించిన నివేదికలను ఆయన కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా తమిళిసైతో మోడీ భేటీలో ఆమె కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి అవసరమై సమాచారాన్ని అందించి ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.

By
en-us Political News

  
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.