Publish Date:May 12, 2025
గత మూడు వారాలుగా భారత్ పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధం జరుగుతోందా అన్నంతగా పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెల 22న కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదులు 26 మంది పౌరలను అత్యంత దారుణంగా, కృరంగా ఖతం చేశారు. ఈ సంఘటనను 2008 ముంబై దాడుల అనంతరం సాధారణ పౌరుల మీద జరిగిన అత్యంత దారుణమైన దాడి అనడంలో సందేహం లేదు.
ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత నరేంద్రమోడీ బీహార్ లోని ఒక సభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడికి వారి ఊహలకు అందనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత ఈ నెల 7 భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా వంద మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. అప్పటి నుంచీ రెండు దేశాల మధ్యా యుద్ధం కొనసాగుతోందా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో భారత భూభాగంపైకి పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడితే.. పాక్ దాడులను భారత ఆర్మీ సమర్ధంగా తిప్పి కొట్టింది. పాక్ లోని నిర్దేశిల లక్ష్యాలపై భారత్ దాడులు చేసింది. ఈ తరుణంలో హఠాత్తుగా ఉరుములేని పిడుగులా శనివారం ( మే10) సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఘనతగా చెప్పుకుంటూ తన జబ్బలు తానే చరిచేసుకున్నారు.
భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కరెక్టే కానీ, ఇందులో మూడో దేశం ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కోరిక మేరకు మానవతా దృక్ఫథంతో తాము పాక్ వినతిని మన్నించామని చెప్పింది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి వెల్లడి కాగానే అప్పటి వరకూ మోడీ జపం చేస్తున్న యావత్ దేశం ఒక్కసారిగా ఆయనై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. సరే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. దీనిపై మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటు నుంచి మిస్సైల్ తో బదులు చెప్పండని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే షెడ్యూల్ ప్రకారం సోమవారం (మే 12) ఇరు దేశాల సైన్యాధ్యక్షుల స్థాయి వర్చువల్ సమావేశంలో సంధికి స్పష్టమైన షరతులు విధించనున్నట్లు కూడా మోడీ మీడియా ముఖంగా ప్రకటించారు.
అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించకపోవడం పట్ల పరిశీలకులు, రాజకీయనాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వారిలో భరోసా నింపాల్సి ఉండగా అందుకు భిన్నంగా మోడీ మౌనముద్ర వహించడం ఏమిటన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-silense-or-stretegy-25-197937.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.