మోడీ, షాలకు ఏపీ గండం?

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక మేరకు పట్టు సాధించాలంటే.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ఒక్కటే మార్గం అని కమలం అధినేతలు తలపోశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వెనకాల ఉన్నది బీజేపీ వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తమ అధికారం పదిలంగా ఉండాలన్నా.. ఏపీలో తమ పెత్తనం సాగాలన్నా చంద్రబాబును రాజకీయంగా బలహీన పరచడం ఒక్కటే మార్గమని మోడీ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏపీలో జగన్ సర్కార్ అడ్డగోలు విధానాలకూ, పరిమితులకు మించిన అప్పులకూ, నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి సాగిస్తున్న అరెస్టులకు అనుమతులు ఇస్తూ.. ఏపీలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమౌతున్న జగన్ ప్రతిష్టను వేడుక చూస్తున్నట్లు కమలనాథులు చూస్తున్నారని అంటున్నారు. 

అయితే బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కు నివేదికలు అందిస్తుండటంతో.. ఏమో ఎటువైపు పోయి ఎటువైపు వస్తుందోనన్న జంకుతో ఇప్పటి వరకూ తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చింది. అడపాదడపా చంద్రబాబను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ద్వారా పోత్తు అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇవ్వడం, అదే సమయంలో జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులకు సై అంటూ.. ఏపీలో బీజేపీ డ్యుయెల్ రోల్ పాటిస్తూ వచ్చింది. 

అయితే ఎప్పుడైతే స్కిల్ స్కామ్ పేరిట చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ అధినాయకత్వం ఖండించలేదో.. అప్పుడే సర్వులకూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తిగా బోధపడింది. దీంతో ఏపీలో బీజేపీ స్టేక్ పూర్తిగా జీరో అయ్యింది. నోటీతో పోటీపడి గత ఎన్నికలలో తెచ్చుకున్న ఒక శాతం ఓటు కూడా ఈ సారి అనుమానమే అంటున్నారు. 

వాస్తవానికి ఏపీలో తమకు ఉన్నదీ, పోయేదీ ఏమీ లేదని కమలనాథులకు స్పష్టంగా తెలుసు.. అయినా జనసేనానిని మిత్రుడిగా చెప్పుకుంటూ.. ఆయనను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి వెనకుండి డ్రామా నడిపిద్దామనుకున్న కమలం అధినేతలకు తన పయనం తెలుగుదేశంతోనే.. కలిసి వస్తుందా? రాదా? అన్నది బీజేపీ ఇష్టం అంటూ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొటేయడంతో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలూ పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సింగిల్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అంతే కాకుండా.. బీజేపీ ఏతర కూటమి ఇండియా.. సమష్టిగా ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సొంతంగా ఓ పుంజీడు స్థానాలు తెచ్చుకోగలిగిన పార్టీలు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితిది. అందుకే ఏపీలో ఎటు పోయి ఎటు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు తెచ్చుకుని తెలుగుదేశం అధికారంలోకి రావడమే ఖాయంగా అత్యధిక పార్లమెంటు స్థానాలలో కూడా విజయం సాధించి.. కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న పరిశీలకుల విశ్లేషణలు బీజేపీని గాభరాపెడుతున్నాయి. ఆ కారణంగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ సర్కార్ కు వెనుకనుంచి అవసరమైన అండదండలందించిందనీ, ఎన్నికల సమయంలో చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని ముందుండి నడిపించే సారథి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పకడ్బందీగా సమాయత్తం కాలేదనీ, అలాగే బాబు ప్రెజెన్స్ లేకుండా తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల సర్దు బాటు, ఓట్ల బదలీ సజావుగా సాగే అవకాశం ఉండదనీ బీజేపీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే బీజేపీ ఆశించినదానికి భిన్నంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోనూ కూడా ఆందోళనలు మిన్నంటలం, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వెలువడటంతో బీజేపీ కంగుతింది. అన్నిటికీ మించి చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కారు.. ఆయన నిర్దోషిగా, స్వచ్ఛంగా బయటకు వస్తారు అని బీజేపీ సీనియర్ నేత.. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో మోడీ, షాల మౌనం వెనుక ఉన్న కుట్ర కోణం బహిర్గతమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు  ఏపీలో బీజేపీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  రాజకీయ స్వార్థంతో.. ఒక బలమైన పార్టీని బలహీనం చేయాలన్న దురుద్దేశంతో బీజేపీ ఆడిన కుట్ర క్రీడకు ఆ పార్టీయే బలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.