Publish Date:May 24, 2023
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ నిస్సహాయత, చేతకాని తనం ఆ దర్యాప్తు సంస్థ ప్రతిష్టనే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టనూ.. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టనూ, ప్రధాని మోడీ ఇమేజ్ నూ కూడా దారుణంగా దెబ్బతీస్తున్నది. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చేతకాని తనంతో వ్యవహరించడానికీ, నిస్సహాయంగా మిగిలిపోవడానికీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ జగన్ సర్కార్ కు ఇస్తున్న వత్తాసే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. ఆ దర్యాప్తు సంస్థపై జనానికి ఇంత కాలం ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
కేంద్ర సహకారం లేకపోతే, ఒక ఎంపి ఇంత అరెస్టు చేయడానికి అడుగుముందుకు వేయకుండా ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తుందా అన్న ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తున్నది. నిజమే వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరు బీజేపీ ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా డ్యామేజీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష సిసోడియాను రెండో ఆలోచన లేకుండా అరెస్టు చేయగలిగిన సీబీఐ.. కడప ఎంపీ విషయంలో ఎందుకు మీన మేషాలు లెక్కపెడుతోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తడబడుతోంది.
సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోం అంటూ గప్పాలు కొట్టి సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఈ విషయంలో బీజేపీ డైలాగులతో ప్రజలను నమ్మించడంలో విఫలమైందనే పరిశీలకులు అంటున్నారు. అవినాష్ కు సీబీఐ అరెస్టుకు మధ్య ఉన్నది కేంద్రంలోని మోడీ సర్కారేనని జనం నమ్ముతున్నారు. జయలలిత,శిబుసోరేన్, జగన్, గాలి జనార్దన్రెడ్డి వంటి అరెస్టు చేసిన సీబీఐ.. ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేసేందుకు, ఒక జిల్లా ఎస్పీని బతిమిలాడుకున్న వైనం చూస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాళ్లూ చేతులూ కట్టేసిందెవరో తెలుసుకోవడానికి పెద్దగా పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోతే, అవినాష్ రెడ్డి ఇప్పటికే అరెస్టై మూడు నెలలు దాటి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎటూ స్టేక్ లేదు. బతిమలాడుకుంటే పొత్తలో భాగంగా ఒక వేళ ఉంటే గింటే.. ఒకటో రెండో ఎంపీ స్థానాలు, మూడో నాలుగో అసెంబ్లీ స్థానాలూ పోటీకి దక్కే అవకాశం ఉండొచ్చు. వాటిలో కూడా గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా, బీజేపీ మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-pride-dininish-in-avinash-episode-39-155837.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.