వెంకయ్యను గిల్లి మోడీ జోల పాట

Publish Date:Aug 12, 2022

Advertisement

పిల్లాడిని గిల్లేసి.. ఆనక తీరిగ్గా జోలపాట పాడిందట వెనుకటికి ఓ మహాతల్లి.  తాజా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరు సరిగ్గా ఇలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లేదా.. ఉప రాష్ట్రపతిగా రెండోసారి కొనసాగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్య నాయుడికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టేసిన మోడీ తీరిగ్గా ఆయనకు మూడు పేజీల ఫేర్ వెల్ లేఖ రాసిన తీరును విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ తన ఫేర్ వెల్ లేఖలో కొనియాడడం గమ్మత్తుగా ఉందంటున్నారు. పొగడడం, అంతటితో ఆగకుండా మోడీ భూదానోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య వినోబా భావేతో వెంకయ్య నాయుడిని పోల్చిన వైనాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏ విషయమైనా సూటిగా, సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వినోబా భావేకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని, అలాంటి లక్షణమే వెంకయ్య నాయుడిలోనూ ఉందని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉప రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడి ప్రయాణం ఎంతో స్ఫూర్తిమంతం అంటూ మోడీ ప్రశంసించారు. అయితే.. అన్ని దశలూ దాటుకుని అంతటి ఘన కీర్తి పొందిన వెంకయ్యపై ఏ మాత్రం గౌరవం లేకుండా బలవంతపు విశ్రాంతికి పంపడం ఏమిటని పలువురు మొడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  ఏపీలో అసలే ప్రాధాన్యం లేని బీజేపీ, రాజకీయ ఉద్యమంలో చేరడానికి వెంకయ్యను ప్రేరేపించిన నమ్మకం, నిబద్ధత ఎంత శక్తిమంతమైనవో ఊహించుకోవచ్చనేది మోడీ వక్తం చేసిన అభిప్రాయం.

వెంకయ్య నాయుడి శక్తి అనంత ప్రవాహం లాంటిదనీ. దాన్ని వెంకయ్య నాయుడి చతురత, జ్ఞానంలో చూడొచ్చనీ. వెంకయ్య వేసే అంత్య ప్రాసలు బాగా ప్రాచుర్యం పొందాయని మోడీ స్వయంగా ఫేర్ వెల్ లేఖలో ప్రస్తావించారు. వాక్చాతుర్యమే వెంకయ్యకు గొప్ప బలం అన్నారు. వెంకయ్య నాయుడి మాటలు ఎప్పుడు విన్నా.. అత్యంత అనువైన పదాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పిన వినోబా భావే తనకు గుర్తుకు వస్తారంటూ కితాబు ఇచ్చారు. వినేవారిని సమ్మెహితులను చేసి, విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే వెంకయ్య నాయుడి సామర్ధ్యం అద్భుతం అని మోడీ కీర్తించారు. అక్కడితో సరిపెట్టని మోడీ ‘వెంకయ్య నాయుడి చతురతకు జీవితకాలం ఆరాధకుడిగా ఉంటాను’ అని ఆ ఫేర్ వెల్ లేఖలో పేర్కొన్నారు. వెంకయ్య వ్యక్తిగత సలహాలతో తాను వ్యక్తిగతంగా ఎంతో లబ్ధి పొందాననీ చెప్పారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడికి సరైన ప్రాధాన్యం కల్పించేందుకు మాత్రం మోడీకి చేతులు, నోరు రాలేదేమని తెలుగు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వెంకయ్య నాయుడి లోతైన ఆలోచనలు, చేసిన విశ్లేషణలను వినేందుకు జర్నలిస్టులు, మేధావులు కూడా ఎంతో ఆసక్తి, ఉత్సుకత చూపించేవారని మోడీ గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేసిన విధానాన్ని బట్టి ఆయన శక్తి సామర్ధ్యాలను అంచనా వేయొచ్చనీ, రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు రాజ్యసభను నిర్వహించిన తీరు అద్భుతం అన్నారు.

ప్రధాని మోడీ. అధికార, ప్రతిపక్ష సభ్యులతో వెంకయ్య నెరపిన సన్నిహిత సంబంధాలు సభలో సౌహార్ద్ర స్ఫూర్తిని నింపాయంటున్నారు. అలాంటి వెంకయ్య నాయుడికి ఉన్నత పదవిలో నిలబెడితే జాతి మరింత స్ఫూర్తి పొందుతుందని, ముందుకు వెళ్తుందని మీరు ఎందుకు భావించలేదని మోడీని జనం ప్రశ్నిస్తున్నారు. పేదరిక నిర్మూలన, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత చూపించిన వెంకయ్య నాయుడు ప్రతి విషయాన్నీ ‘నేషన్ ఫస్ట్’ కోణంలో చూసేవారని మోడీ చెప్పుకొచ్చారు. అలా నేషన్ ఫస్ట్ భావనతో ఉండే వెంకయ్య నాయుడు దేశ ప్రథమ పౌరుడిగా పనికిరాలేకపోయారా? మోడీ గారూ అంటూ పలువురు నిలదీస్తున్నారు. వెంకయ్య నాయుడి అనుభవం, జ్ఞానం భవిష్యత్ లో శాసనకర్తలకు వెలలేని ఆస్తులుగా ఉపయోగపడతాయంటున్న మోడీ.. మరి ఆయనను రాష్ట్రపతిని చేయడానికి ఇంకేమి లోపం కనిపించిందో వెల్లడిస్తే బాగుంటుందంటున్నారు.

By
en-us Political News

  
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.