మోదీ నాయకత్వం.. తక్షణ ప్రయోజనాల కోసం కాదు.. భవిష్యత్ కోసం!

Publish Date:Apr 20, 2026

Advertisement

సాధారణంగా భారత రాజకీయాలలో నేతలు తక్షణ ఫలితాలే పరమావధిగా పని చేస్తుంటారు. ఈ రోజు వార్తల్లో ఎలా కనిపించాలి. ఎన్నికలలో ఎలా లాభపడాలి, ప్రత్యర్థిపై పై చేయి ఎలా సాధించాలి అన్న దానిపైనే ఆలోచిస్తుంటారు. ఆ తక్షణ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతుంటారు.  అయితే ప్రధాని మోడీ అలా కాదంటారు విశ్లేషకులు. మోడీ రాజకీయాలు ఐదు రోజుల కోసమే, తక్షణ ప్రయోజనాల కోసమో కాదు.. రాబోయే ఐదు దశాబ్దాల కోసమని అంటారు. అంటే దేశ భవిష్యత్, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, జియోపాలిటికల్ ప్లేస్, గ్లోబల్ ఎఫెక్ట్..వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మోడీ అడుగులు వేస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ.  

ముందుండి నడిపిస్తున్నా..  వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు.  మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు.  
ఆయన రాజకీయ శైలిలో  ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.  ప్రాక్టివ్ లీడర్షిప్.. దేశానికి అవసరమైన సంస్కరణలను ముందే ప్రారంభించడం. రియాక్టవ్   అవగాహన.. ప్రత్యర్థులు ఏ దిశగా కదులుతున్నారో అర్ధం చేసుకుని.. అదే దిశలో ముందుగానే కౌంటర్ స్ట్రాటజీ అంటే ప్రతి వ్యూహం సిద్ధం చేయడం. 

 ప్రపంచ సంక్షోభాల్లో మోదీ నాయకత్వం 

గత దశాబ్దంలో భారత్ ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటంటే.. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక మాంద్యం, చైనా, అమెరికా ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అస్ధిరత.  వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడటంలో మోడీ నాయకత్వమే కీలకమని పరిశలకులు విశ్లేషిస్తున్నారు.   
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్నది. విదేశీ పెట్టుబడుల్లో గణనీయ పురోగతి, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మౌలిక సదుపాయాల విస్తరణ. బలోపేతమౌతున్న మాన్యు ఫ్యాక్చరింగ్ రంగం. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దృష్టితో మోడీ తీసుకున్ననిర్ణయాల ఫలితమేనని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక మోడీ వ్యతిరేకులు తరచూ..    ఆర్థిక వ్యవస్థపై, విదేశాంగ విధానంపై, అంతర్గత రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. అదే సమయంలో మోడీ అనుకూలురు మాత్రం విమర్శకులు తాత్కాలిక సమస్యలపై దృష్టి పెడతారనీ,  మోదీ మాత్రం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడతారనీ సమర్ధిస్తారు. 
అంటే.. విమర్శలు తక్షణ ప్రతిస్పందన, మోడీ నిర్ణయాలు, విధానాలూ భవిష్యత్ నిర్మాణం కోసం అంటుంటారు.  విశ్లేషకుల అంచనాల ప్రకారం మోడీ మరో నాలుగైదేళ్ల పాలన భారత్ ను సురక్షితమైన, ఆర్థికంగా బలమైన, జియోపాలిటికల్గా ప్రభావవంతమైన, ప్రపంచంలో తిరుగులేని స్థానంలో నిలబెట్టే అవకాశం ఉంది. అంటే.. మోదీ నాయకత్వంలో భారత్  విశ్వగురు దిశగా పయనిస్తోంది. మోదీ నాయకత్వం  తక్షణ రాజకీయాలకంటే పెద్ద కథ. మోదీ నాయకత్వాన్ని అనుకూలంగా చూసే వర్గం ఆయనను దూరదృష్టి ఉన్న నాయకుడిగా చూస్తుంటే.. అయన విమర్శకులు మాత్రం తక్షణ రాజకీ యాల నాయకుడిగా చూస్తారు. కానీ మోడీ మద్దతుదారుల దృష్టిలో  ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం భారత భవిష్యత్తు కోసం వేసిన పునాది.అందుకే  వారు మోడీని అంచనా వేయడం సులభం కాదు.. ఆయన రాజకీయాలు ఈ రోజు కోసం కాదు.. రాబోయే దశాబ్దాల కోసమని చెబుతారు. 

సంకలనం, సేకరణ : సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.