నాయుడు మాజీ పీ.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు?

Publish Date:Feb 8, 2020

Advertisement

ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో పెండ్యాల ఇంతకీ ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈ.డీ) కి ఏమి సమాచారం చేరవేశారు? కిలారు రాజేష్, గుత్తా కిరణ్ లనూ ఇదే విషయమై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడో రోజు కూడా శ్రీనివాస్ ఇంటిలో ఈ.డీ. చేస్తున్న సోదాలకు , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డి.ఆర్.ఐ.), ఇన్ కమ్ ట్యాక్స్ (ఐ.టీ.) బృందాలు కూడా తోడవటం తెలుగుదేశం పార్టీ సీనియర్లను కలవరపెడుతోంది. పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోని రహస్య లాకర్ల నుంచి కీలకమైన ఓత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ.డీ. , డీ.ఆర్.ఐ. , ఐ.టీ . బృందాలు ప్రస్తుతం వాటిని అధ్యయనం చేసే పనిలో పడినట్టు సమాచారం. వాస్తవానికి, తమ నాయకుల నివాసాలు, వ్యాపార సంస్థలపైన లోగడ ఐ.టి. దాడులు జరిగినప్పుడు హడావుడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్ర సంస్థలను ఏకిపారేసిన తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇప్పుడు జరుగుతున్న సోదాల మీద మాత్రం ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, కేంద్ర సంస్థల తీరును ప్రశ్నిచే ప్రయత్నం కానీ చేయకపోవటం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది.

వాస్తవానికి, నిరుడు అక్టోబర్ లో జరిగిన సోదాల్లోనే ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ సంస్థ, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా జరిపిన లావా దేవీల వ్యవహారం అంతా గమనించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సి.బి.డి.టి.), ఇంకా ఐ.టి. అధికారులు ఆ ఇన్ఫ్రా మేజర్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ సంస్థ నుంచి దాదాపు 750 కోట్ల రూపాయల విరాళాలు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటి నుంచే, దీనిపైన నిఘా వుంచిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈ.ఓ. డబ్ల్యు. ) ఆ దరిమిలా చేపట్టిన విచారణలో... అప్పటి ముఖ్యమంత్రి పెర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖం గా ఫిగర్ అయింది. అలాగే, నారా లోకేష్ కుడి భుజం, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కిలారు రాజేష్, గుత్తా కిరణ్ ల వ్యవహారం పైన కూడా ఈ నిఘాసంస్థలన్నీ దృష్టి సారించాయి. ముంబై కి చెందిన ఇన్ఫ్రా మేజర్ నుండి 150 కోట్ల రూపాయల  విరాళం తెలుగుదేశం పార్టీకి విరాళంగా వెళ్ళిందంటూ వచ్చిన వార్తల దరిమిలా, ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతున్న పెండ్యాల శ్రీనివాస్ ను పూర్తి స్థాయి లో విచారించటానికే, ఆయన్ను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ఐదేళ్ల పదవికాలం లో ఆ సంస్థకు దాదాపు 2230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం లో కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ, నారా లోకేష్ అనుయాయులపైనా, వారి ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన డాక్యుమెంట్ల పైన లోతైన అధ్యయనం చేయటం కోసమే నిఘాసంస్థలు ఇంత సమయం తీసుకుంటున్నామని సమాచారం. పనులు ఇచ్చినందుకు గాను అప్పట్లో గవర్నమెంట్ కు చెందిన వ్యక్తి కి 700 కోట్లు చెల్లించాలని, అందులో భాగంగా అప్పటి అధికార పార్టీకి ఎన్నికల సమయంలో 150 కోట్ల రూపాయల డబ్బులు అందాయని  దర్యాప్తు సంస్థల విచారణ లో ప్రాధమికంగా వెల్లడైన అంశం.

ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్, ఆగ్రా, పూణే, గోవాలతో పాటు 42 చోట్ల, నిరుడు నవంబరు లో జరిపిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు తేలినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఎన్నికల సమయం లో 150 కోట్ల రూపాయల డబ్బు  హైదరాబాద్ మీదుగా విజయవాడ కు చేరినట్టు గుర్తించిన ఐటీ అధికారులు, తర్వాతి విచారణ నిమిత్తం, ఈ.డీ., డీ.ఆర్. ఐ. ల సాయం కోరినట్టు సమాచారం.

నిజానికి, ఇంత భారీ స్థాయిలో సోదాలు జరుగుతుంటే, అందునా... తన మాజీ పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోనూ, లోకేష్ ఆంతరంగికుడు కిలారు రాజేష్, అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి నివాసాల్లోనూ ఈ సోదాలు గడిచిన 36 గంటలుగా జరుగుతుంటే, తెలుగుదేశం అగ్రనాయకత్వం కిక్కురుమనకుండా కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి, ఇప్పటికే వైఎస్ఆర్సిపీ ని ఈ ఎపిసోడ్ లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసి ఉండేదనీ, అయితే, అవతల దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగటం తో ఏమి జరుగుతుందో వేచి చూద్దామనే ధోరణిలోకి తెలుగుదేశం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలేవీ వైఎస్ఆర్సిపీ కి కూడా మింగుడుపడటం లేదు..కారణమేమిటంటే , రాబోయే రోజుల్లో తమ వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా కేంద్ర సంస్థలు ఈ రకమైన సోదాలు నిర్వహించవచ్చునేమోననే సందేహాలు ఆ పార్టీ లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం బట్టి పెండ్యాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు మాత్రమే ...దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.