Publish Date:Dec 16, 2019
చలికాలంలోనూ ధరలు మండిపోతుంటే... సామాన్యులపై మరింత పెనుభారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఆర్ధిక మందగమనం... మరోవైపు వినిమయశక్తి పడిపోవడంతో... పన్ను ఆదాయ లోటును పూడ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. జీఎస్టీ రేట్లను పెంచేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ప్రస్తుతమున్న జీఎస్టీ స్లాబ్స్ను కుదించి... రేట్లను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ ను, మూడింటికి కుదించి ...8, 18, 28 శాతం చొప్పున అమలు చేయాలని భావిస్తోంది. కేంద్రం ఆశించినస్థాయిలో జీఎస్టీ ఆదాయం రాకపోవడంతోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం అనుకున్నదాని కంటే 40 శాతం తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 5లక్షల 26వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా... కేవలం 3లక్షల 28వేల 365కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 2017 నుంచి ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతోంది. అయితే, కనిష్ట పన్ను స్లాబు 5శాతాన్ని 8శాతానికి పెంచితే అదనంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కానీ, ఈ స్లాబ్ రేటును పెంచితే నిత్యవసర ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు. అలాగే, జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు హెల్త్ కేర్ రంగాన్ని 18పర్సంటేజ్ స్లాబ్లోకి చేర్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో, సామాన్యులపై పెనుభారం పడుతుందని చెబుతున్నారు. అలాగే, మొబైల్స్ ఫోన్స్ పైనా జీఎస్టీ రేట్లు పెంచాలని కేంద్రం చూస్తోంది.
ఆర్ధిక మందగమనంతోపాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దాంతో, జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోవడమే కాక, పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో పడ్డాయి. మరోవైపు, ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో, అదనపు ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని మోడీ సర్కారు భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతమున్న నాలుగు స్లాబులను మూడింటికి కుదించడంతోపాటు రేట్లు పెంచడం... అలాగే జీఎస్టీకి అదనంగా విధించే సుంకాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ప్రస్తుతమున్న 5 పర్సంటేజ్ స్లాబ్ను 3శాతం పెంచి 8 చేయడం... అలాగే, 12శాతం స్లాబ్ను ఎత్తివేసి... దాన్ని 18లో విలీనం చేయనున్నారు. ఇక, చివరిదైన 28శాతం స్లాబ్ను యథాతథంగా ఉంచి సెస్ పెంచనున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 18న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో స్లాబ్స్ కుదింపు... రేట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-govt-plans-to-increase-gst-rates-39-92235.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.