కేసీఆర్ రాజకీయం కుటుంబం కోసమే.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?

Publish Date:Oct 4, 2023

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు. తెలంగాణ  ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం లోగా ఎప్పుడు అయినా వెలువడే అవకాశం ఉందన్న సమాచరం నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్ నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో  చేసిన ప్రసంగంతో ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారనే చెప్పాలి. 

నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసేసి ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైపోయినట్లు కనిపించిన బీఆర్ఎస్ ఆ తరువాత కారణాలేమైతేనేం ఎన్నికల సన్నాహకాలలో బాగా వెనుకబడిపోయింది. చంద్రబాబు అరెస్టు, కాంగ్రెస్ దూకుడు, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి ఇలా బీఆర్ఎస్ వెనుకబాటుకు చాలా చాలా కారణాలున్నాయి. 

ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లే కనిపించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత ఒక్కసారిగా చతికిల బడినట్లు కనిపించింది. దీంతో తెలంగాణలో పార్టీలో జోష్ నింపేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగానే మూడు రోజుల వ్యవధిలో మోడీ తెలంగాణలో రెండు బహిరంగ సభలలో  ప్రసంగించి పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. అయితే కమలం పార్టీలో  అసమ్మగి భగభగలు చల్లారకపోవడం.. ప్రధాని మోడీ సభకు సైతం పలువురు సీనియర్లు డుమ్మా కొట్టడంతో రెండో సభలో ప్రధాని మోడీ తన ప్రసంగ వ్యూహం మార్చారు. అధికార పార్టీని బినీత్ ది బెల్ట్ కోట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడిని సీఎం చేయడం కోసం కేసీఆర్ అన్ని ప్రమాణాలనూ పక్కన పెట్టేయడానికి సిద్ధ పడ్డారనీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరేందుకు కూడా వెంపర్లాడారనీ వెల్లడించారు. సహజంగానే మోడీ ప్రసంగం తరువాత బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ మోడీ చెప్పినవి అబద్ధాలంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని జుమ్లా పార్టీగా అభివర్ణించారు. 

అయితే ప్రధాని మోడీ మాత్రం పక్కా వ్యూహంతోనే నాలుగేళ్ల కిందట కేసీఆర్ తనతో చర్చించిన వివరాలను సరిగ్గా ఎన్నికల వేళ వెల్లడించి బీఆర్ఎస్ గుక్కతిప్పుకోలేకుండా చేశారు.  కేసీఆర్ హస్తిన వెళ్లిన ప్రతి సారి ప్రధాని మోడీని కలిసి తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, పురోగతి వినా మరో విషయమే మాట్లాడేవారు కాదంటూ ఇంత కాలం గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్.. మోడీతో కేసీఆర్ విభేదించడానికి కారణం కూడా తెలంగాణకు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నందునే అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మోడీ కేసీఆర్ రాష్ట్ర ప్రగతి గురించి కాకుండా, తన కుమారుడి ప్రమోషన్ కోసమే హస్తినలో కేంద్ర పెద్దలతో భేటీ అయ్యేవారిని మోడీ స్వయంగా చెప్పడం వారిని కంగుతినిపించింది. 
వాస్తవానికి కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించిన క్షణం నుంచీ ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. కేటీఆర్ కు పదోన్నతికి అడ్డుపడే అవకాశం ఉందన్న భావనతోనే  2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తొలి కేబినెట్ లో హరీష్ రావు, ఈటల వంటి వారికి చోటుదక్కలేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా వారిరువురికీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించినప్పటికీ.. వారి ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించారు. ఇక ధిక్కార స్వరం వినిపించిన ఈటలను పార్టీ నుంచే సాగనంపారు. ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలంటూ కేసీఆర్ తనను కోరారని మోడీయే స్వయంగా చెప్పడంతో.. కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. మోడీ చెప్పినవన్నీ అబద్ధాలని కేటీఆర్ ప్రకటించినంత మాత్రాన సరిపోదు. మోడీ మాటలు వాస్తవం కాదని కేసీఆర్ స్వయంగా చెప్పాలి. వివరణ ఇవ్వాలి. అయితే ఇంత వరకూ అయితే కేసీఆర్ నుంచి ఎటువంటి ఖండనా, కనీసం స్పందనా రాలేదు.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు అవుతారా? అవ్వరా అన్నఉత్కంఠ మొదలైంది. మద్యం కుంభకోణం నుంచి కవితను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, మోడీపై విమర్శల దాడిని పూర్తిగా తగ్గించేశారన్న అనుమానాలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ కేసీఆర్ నాలుగేళ్ల కిందటే తనకు దాసోహం అన్నారనీ, తానే ఆయన ఎన్డీయేలో చేరుతానన్న ప్రతిపాదనను తిరస్కరించాననీ చెప్పడంతో కేసీఆర్ జాతీయ ఆకాంక్షలపైనే తెలంగాణ ప్రజలలో  అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్ మౌనం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.  

ముఖ్యంగా కేటీఆర్ ను  ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నానంటూ కేసీఆర్ తనతో స్వయంగా చెప్పి కుమారుడిని ఆశీర్వదించాలని కోరిట్లు మోడీ వెల్లడించడంతో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనని ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే  ఉన్న ప్రరాన్ని మోడీ వ్యాఖ్యలు ధృవీకరించాయి. అయితే అందు కోసం ఎన్‌డీఏ కూటమిలో చేరడానికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారన్న మోడీ మాటలు బీఆర్ఎస్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.