మళ్లీ వలసలు షురూ!.. బీఆర్ఎస్ కు ఇక దబిడి దిబిడే.. విపక్ష హోదా హుళక్కే!?

Publish Date:Aug 13, 2024

Advertisement

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్ధితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు కార్యకర్తలతో మమేకమౌతో, అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ చురుకుగా కనిపిస్తున్నా, అధినేత క్రియాశీలంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎలా అయితే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయడానికి వలసలకు పార్టీ తలుపులు బార్లా తీశారో.. ఇంచుమించు అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వారి రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డిమాండ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిందిదేగా అంటూ జనం కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించడం ద్వారా బీఆర్ఎస్ సాధించగలిగేది పెద్దగా ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలో కోర్టులు నిర్దేశించజాలవు. దీంతో  అనర్హత వేటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు. 
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు నెమ్మదించాయి. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సెటిల్ అవుతోందన్న భావన విపక్షాలలో కలిగింది. అయితే మళ్లీ హఠాత్తుగా కనీసం ఆరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు తెలంగాణ రాజకీయాలలో మరోసారి సెగపుట్టించాయి.రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మళ్లీ వలసల జోరు పెరుగుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారనీ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగా రాగానే ఈ వలసలు ఉంటాయని బీఆర్ఓస్ వర్గాలే చెబుతున్నాయి. 
వాస్తవానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకోవడం వెనుక నీవునేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చిన్న రివెంజ్ ఉన్నప్పటికీ ..అంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ కేసీఆర్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 దానం నాగేందర్ తో మొదలై ఇప్పటి వరకూ విడతల వారీగా ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ టార్గెట్ మరో పదహారు మంది అని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా  పెట్టుకున్న రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకున్న చందంగానే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని భావించిన రేవంత్ ఆ దిశగా పావులు కదిపారు. అయితే కారణాలేమైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికకు తలుపులు తెరవడానికి రెడీ అయ్యారని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత రేవంత్ అదే పని మీద ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్, శివారు నియోజకవర్గాలపైనే రేవంత్ రెడ్డి  దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. మరో అరడజను మంది కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు.  మరో పదిమందిపైనా రేవంత్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టనున్నట్లు చెబుతున్నారు. 

అయితే అలా వచ్చి చేరేవారికి మంత్రి పదవుల హామీ ఇవ్వలేనని రేవంత్ ముందుగానే చెప్పేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక రార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించేందుకు మాత్రం రేవంత్ సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.