Publish Date:Mar 30, 2013
ఆరు నెలల తరువాత మెదక్ జిల్లా ఇన్ ఛార్జీ డి.కె. అరుణ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ గీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యేలు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ లు హాజరయ్యారు. సమావేశంలో ముత్యం రెడ్డి తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రూ.5 లక్షలు ఎలా కేటాయించారని అధికారులను ప్రశ్నించారు. అది ముత్యంరెడ్డి, ఫారుక్ మధ్య వివాదానికి దారి తీసింది. నువ్వు దొంగవి అంటే నువ్వు దొంగవి అని ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. డి.కే.అరుణ, ఎమ్మెల్యేలు వారిని శాంతింపచేశారు. మళ్ళీ ఉపాధి హామీ గురించి చర్చ జరుగుతుండగా ముత్యంరెడ్డి తన నియోజకవర్గ నిధుల నుంచి డ్వాక్రా భవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చానని కానీ ఎన్ని బావుల పూడికలు తీశారో అధికారులు లెక్కలు ఇవ్వటంలేదని వారిపై మండిపడ్డారు. ఫారుక్ హుస్సేన్ కల్పించుకుని ఆడవారిని గౌరవించేలా మాట్లాడాలని ముత్యంరెడ్డికి హితవు పలికారు. దీంతో రెచ్చిపోయిన ముత్యం రెడ్డి మళ్ళీ తిట్ల దండకం అందుకున్నారు. హుస్సేన్ కూడా తానేమీ తీసిపోలేదని అతనూ తిట్ల దండకం ప్రారంభించారు. వీరిని శాంతింపచేయడానికి జిల్లా ఇన్ ఛార్జి, ఎమ్మెల్యేల ప్రాణం తోకకొచ్చింది. ఇలా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిథులు నిసిగ్గుగా, బహిరంగంగా ఇద్దరు మహిళలు ఉన్న సభలో తిట్లదండకం మొదలుపెడితే ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు వారికే తెలియాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-muthyam-reddy-and--mlc-farooq-hussain-quarelled-in-medak-drc-meeting-39-22076.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.