ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ముందుగా చెప్పినట్లే సోమవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అంద జేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారి కంగా ప్రకటించింది. అనంతరం గవర్నర్ తమిళిసై ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపా యింట్ మెంట్ కోరారు. కాగా రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్సై పోయిందని తెలుస్తున్నది. ఈ నెలాఖరులో ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారు.
2018 డిసెంబర్లో మునుగోడు ఎమ్మెల్యే గా రాగోపాల్ రెడ్డి గెలిచారు. కాగా కేసీఆర్ పాలనలో తెలంగాణా అన్యాయమైపోయిందని, తెలంగాణా తల్లిని కాపాడుకోవడానికే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చానని రాజ్గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని, దీన్ని ఎదుర్కొని పాలక పక్షాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి లేదని రాజ గోపాల్ అన్నా రు. ఆయన రాజీనామా చేయడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మునగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
పార్టీ సభ్యత్వానికీ, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొల గించాలా వద్దా అన్న అంశం మీద ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో పార్టీ నాయకుల సమావేశానంతరం కోమటిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరుతున్నారన్నది అప్పు డు చెప్పనప్పటికీ రాజీనామా అనంతరం ఆయనీ విషయంలో స్పష్టత ఇచ్చారు. అమిత్ షా సమక్షంలో ఆయన ఈ నెల చివరి వారంలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు, బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి మారుతుండడం విషయం లోనూ పార్టీ నాయకులు వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పట్ల కూడా ఆయన ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పార్టీ హైకమాండ్ను గతంలో విమర్శించినవారికే పార్టీలో కీలక పదవులు కట్టిపెట్టడం పట్ల కూడా రాజ గోపాల్ అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడి యాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీ ఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమ ర్శించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తా రని తెలిపారు. టీపీసీసీ చీప్ భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-krajagopalreddi-resigned--39-141479.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది