మైనారిటీల హక్కుల దినోత్సవం 2024…వెనుకబడిన ప్రజలకు అపురూప వరం మైనారిటీ హక్కులు..!

Publish Date:Dec 18, 2024

Advertisement

 

ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు. ఇందులో కొన్ని వర్గాల వారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటారు.  కొన్ని వర్గాలవారి సంఖ్య  తక్కువ లేదా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని మైనారిటీలగా గుర్తిస్తారు. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశంలో ఉన్నంత  భిన్నత్వం ఏ దేశంలోనూ  ఉండదు. అయినా సరే భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణగా ఇప్పటికీ నిలుస్తుంది. దీనికి కారణం మన భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ  సమాన హక్కులను అందించడమే కాకుండా భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన మైనారిటీల  హక్కులను రక్షించడానికి పలు చర్యలను అమలు చేసింది. మైనారిటీల హక్కులు, భద్రత, అభివృద్ధి గురించి అవగాహన కల్పించడం,  మైనారిటీల సమస్యలను గుర్తించి, వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవటానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎప్పుడు మొదలైంది..


మొదటి మైనారిటీ హక్కుల దినోత్సవం 2013లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన  మైనారిటీల హక్కుల ప్రకటనపై  సంతకం చేసిన తరువాత మనదేశం ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం 1992లో స్థాపించిన ‘జాతీయ మైనారిటీ కమిషన్ (NCM)’, ఈ  మైనారిటీల హక్కులని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

2024 థీమ్...

ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు.  2024 సంవత్సరానికి “వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, హక్కులను కాపాడటం” అనే థీమ్ ప్రకటించారు.  మన దేశంలో మత, భాష, సాంస్కృతిక, సామాజిక పరంగా ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి  మైనారిటీల హక్కులను కాపాడాల్సిన  అవసరాన్ని ఈ  థీమ్ తెలియజేస్తుంది.

మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎందుకు అవసరం..

మైనారిటీలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.  రాజ్యాంగపరంగా, చట్టపరంగా మైనారిటీలకి ఉన్న  హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక, విద్యా లోటుపాట్లను తొలగించటానికి కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 క్రింద మైనారిటీలకు హక్కులు కల్పిస్తుంది. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి మైనారిటీల సంక్షేమం కోసం  పనిచేయాలని పిలుపునిస్తుంది.

భారతదేశంలో ఎవరు మైనారిటీలు?

భారతదేశంలో మైనారిటీలను మతం, భాష, సంస్కృతిపై ఆధారపడి నిర్వచిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారం, 6 మత సమూహాలు అధికారికంగా మైనారిటీగా గుర్తించబడ్డాయి. మొదట ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు(జొరాష్ట్రియన్లు) మైనారిటీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2014లో జైనులను కూడా మైనారిటీలో భాగం చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని మైనారిటీల్లో మొదటి స్థానంలో ముస్లింలు, చివరి స్థానంలో పార్శీలు ఉన్నారు. కేవలం మతం ఆధారంగానే కాకుండా  భాష, జాతి ఆధారంగా  కూడా మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఉన్నాయి. మైనారిటీలందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30..  సాంస్కృతిక, విద్యా హక్కులను రక్షిస్తాయి.

నేషనల్  మైనారిటీ కమిషన్ పాత్ర....

జాతీయ మైనారిటీ కమిషన్ 1992లో స్థాపించబడింది. ఇది మైనారిటీల హక్కులను రక్షించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించటం, హక్కులకి భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం, మైనారిటీల అభివృద్ధికి పాలసీలను సిఫార్సు చేయటం,  వారి  ఆర్థిక, సామాజిక పురోగతిని సమీక్షించటం ఈ కమిషన్ ముఖ్య విధులుగా ఉన్నాయి.
మైనారిటీల హక్కులని కాపాడటానికి,  చాలా రాష్ట్రాల్లో కూడా  స్టేట్ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కూడా మన రాజ్యాంగానికి అనుగుణంగానే  మైనారిటీల హక్కుల్ని కాపాడి, వారి అభివృద్ధికి కృషి చేస్తాయి.

 మైనారిటీ హక్కుల దినోత్సవం ద్వారా ప్రభుత్వం, సమాజం, ప్రజలు  కలిసికట్టుగా మన దేశంలో సమానత్వం, న్యాయం కోసం పని చేయాలి. మన దేశ అభివృద్ధిలో మైనారిటీల పాత్రని కూడా గుర్తించాలి. సమాజంలో ఏ ఒక్కరూ వివక్షకి గురి కావటమో లేక హక్కులకి, అభివృద్ధికి దూరం కాబడటమో అనేది  వారితోపాటూ ఆ సమాజానికే మంచిది కాదు.  కాబట్టి  మైనారిటీల హక్కులను పరిరక్షించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ దిశగా పని చేయాలి. ఇలా ఉన్నప్పుడు  మన భారతదేశం ఎప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి  ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది.

                                         *రూపశ్రీ.
 

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.