శనగపిండి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

Publish Date:Dec 19, 2024

Advertisement


శనగపిండి భారతీయులు ఉపయోగించే పిండులలో ఒకటి.  శనగపిండిని పిండి వంటల నుండి,  కూరలు,  స్నాక్స్ వంటివి తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు.  ముఖ్యంగా పకోడీలు, బజ్జీలు చేయడానికి శనగపిండి కావాల్సిందే. అయితే శనగపిండికి తొందరగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన పిండిని వాడుకోవడం అంటే ఎవరికీ నచ్చదు. ఎంత జల్లించి వాడుకోవాలని చూసినా అది  అంత ఆరోగ్యం కూడా కాదు. అలా కాకుండా శనగపిండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అదే విధంగా శనగపిండి ఉపయోగాలు కూడా తెలుసుకుంటే.


శనగ పిండి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్,  విటమిన్ B6 వంటి అనేక పోషకాలు శనగపిండిలో ఉంటాయి. దీని కారణంగా ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది, ముఖ్యంగా కండరాలను బలోపేతం చేయడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


టైట్ కంటైనర్..

గాలి చొరబడని డబ్బాలో గాలి,  తేమ తగలకుండా ఉండేలా శనగపిండిని నిల్వచేయాలి. ఇది శనగపిండి తాజాదనాన్ని,  రుచిని తగ్గకుండా చేస్తుంది.


చల్లని, పొడి ప్రదేశం..

శనగ పిండిని చల్లని,  పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమతో కూడిన ప్రదేశంలో ఉంచడం వల్ల దానిలో ఫంగస్ లేదా కీటకాలు పెరుగుతాయి. దాని కారణంగా అది చెడిపోతుంది.


ఫ్రిడ్జ్ లో..

శనగ పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయవలసి వస్తే, దానిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఇది పురుగు పట్టకుండా చేస్తుంది.


సిలికా జెల్ ప్యాక్..


కంటైనర్‌కు సిలికా జెల్ ప్యాక్‌లను జోడించావి. ఇది తేమను గ్రహిస్తుంది. శనగ పిండిని పొడిగా ఉంచుతుంది. దీని వల్ల శనగపిండి త్వరగా పాడవదు.


సూర్యకాంతి..

శనగ పిండికి డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా చూసుకోవాలి. నేరుగా  ఎండలో ఉంచడం వల్ల అందులో తేమ పేరుకుపోయి శనగ పిండి త్వరగా పాడవుతుంది.

స్పూన్..

శనగపిండిని బయటకు తీయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన  పొడి చెంచాను ఉపయోగించాలి. ఇలా చేస్తే అందులో తేమ తగలదు.  పిండి కూడా శుభ్రంగా ఉంటుంది.


కొనుగోలు..

కొత్త శనగ పిండిని కొనుగోలు చేసే ముందు దాని తాజాదనాన్ని,  ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయాలి.  అందులో తేమ లేదా కీటకాలు లేవని నిర్ధారించుకోండి.


                                         *రూపశ్రీ.

By
en-us Political News

  
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.