కేంద్రం సన్న బియ్యం ఇస్తే ప్రధాని ఫొటోపై ఆలోచిస్తాం : మంత్రి ఉత్తమ్

Publish Date:Aug 15, 2026

Advertisement

 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడొద్దని, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను అభినందించాలని ఆయన కోరారు.రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావడం, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడమే లక్ష్యంగా స్మార్ట్ కార్డుల విధానాన్ని తీసుకొచ్చా మని చెప్పారు.

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం భారీ స్థాయిలో సన్న బియ్యం అందిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు నాణ్య మైన బియ్యం అందించ డమే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14,900 కోట్లు వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దని సూచించారు. గతంలో అరకొరగా రేషన్ బియ్యం అందించిన వారు, అసలు ఇవ్వని వారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.“

మా ప్రయత్నాన్ని విమర్శించడం మాని అభినందించండి. పేదల కడుపు నింపే కార్యక్రమం పై రాజకీయాలు చేయొద్దు” అని మంత్రి ధ్వజమెత్తారు. స్మార్ట్ కార్డులపై ఫొటోల అంశంపైనా మంత్రి స్పందించారు. రాజకీయ నాయకులు తమ కార్డుల్లో ఫొటోలు పెట్టుకోవద్దని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని తెలిపారు. అయితే స్మార్ట్ కార్డుల ప్రధాన ఉద్దేశం ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శ కంగా అందేలా చూడటమే నని చెప్పారు.

రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఏర్పాటు చేయడంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెడుతు న్నామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం కోసం పూర్తి ఖర్చును భరిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని అన్నారు.“కేంద్రం పూర్తిగా భరించి సన్న బియ్యం ఇస్తే.. అప్పుడు మోదీ ఫొటోపై ఆలోచన చేస్తాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సన్న బియ్యం, స్మార్ట్ కార్డుల అంశాలపై రాజకీయ రాద్ధాంతాలు చేయకుండా, పేదలకు అందుతున్న ప్రయోజ నాలను చూడాలని మంత్రి సూచించారు. కేంద్రం అందిస్తున్నది దొడ్డు బియ్యం మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భారీగా ఖర్చు చేసి ప్రజలకు సన్న బియ్యం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, పేదలకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Minister Uttam Kumar Reddy, Ration smart cards, PM MODI, CM Revanth reddy, Civil Supplies Department

By
en-us Political News

  
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..!
అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
లంచం తీసుకునేందుకు దళారిని రంగంలోకి దింపిన రైల్వే ఉన్నతా ధికారిని సీబీఐ రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకుంది.
గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
చెన్నై స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా త్రిష..!
స్వాతంత్ర్య వేడుకల్లో రామనారాయణరెడ్డి అస్వస్థత..!
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
చోరీ చేసిన చీరే దంపతులను పట్టిచ్చింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.