ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్. దీంతో ఈయన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నారు. ఒక టెంపో డ్రైవర్ స్థాయి నుంచి విమానయాన సంస్థ ఓనర్ వరకూ ఎలా ఎదిగాడన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
మధ్య తరగతి విమాన యాన కలను ఎలాగైనా సరే సాకారం చేయాలన్న దృక్పథంతో శ్రవణ్ ఈ రంగంలో అడుగు పెట్టినట్టు చెబుతున్నారు. యూపీ నుంచి వస్తోన్న తొలి విమానయాన సంస్థను ప్రారంభించారు. శ్రవణ్ తొలుత సిమెంట్, స్టీల్, రవాణా రంగాల్లో వ్యాపారాలు చేశారు. 2026లో దేశీయ విమాన సేవలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రవణ్.
శ్రవణ్ విశ్వకర్మ నేపథ్యం ఏంటో చూస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. చిన్నతనంలోనే చదువుకు విరామం ప్రకటించి టెంపో నడపటం స్టార్ట్ చేశారు. తొలుత లోడర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రవణ్. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి రవాణా నుంచి స్టీల్ కి ఆపై సిమెంట్, మైనింగ్ రంగాల్లో విజయవంతమైన వ్యాపార నిర్వహణ చేశారు.
శ్రవణ్ చిన్నప్పటి కల విమానయానం. దీంతో ఈ రంగంలో అడుగు పెట్టి శంఖ్ ఎయిర్ ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం.. మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలాంటి ధరలు. సామాన్యులు కూడా ఎంతో సాదా సీదాగా విమానయానం చేసేయ్యడమే శ్రవణ్ తన ముందు పెట్టుకున్న టార్గెట్. తొలిగా మూడు ఎయిర్ బస్సులతో శ్రవణ్ తన శంఖ్ ఎయిర్ ని ప్రారంభించారు. లక్నో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కనెక్ట్ చేయడం, పండుగల సమయంలో కూడా ధరలు పెరగకుండా చూసుకోవడం. తన ప్రయారిటీస్ గా పెట్టుకుందీ సంస్థ.
ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి విమాన యాన సంస్థలు ఎన్నో పుటకు రావల్సిన అవసరం కనిపిస్తోంది.. కారణం మొన్నటి ఇండిగో వ్యవహారం చూస్తూనే ఉన్నాం. ఈ సంస్థ గుత్తాధిపత్యం కారణంగా దేశమే స్తంభించి పోయిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి.. యువ కేంద్ర మంత్రి తెలుగు తేజమైన రామ్మోహన నాయుడి అధ్వర్యంలో శ్రవణ్ లాంటి మరి కొందరు ఈ రంగంలోకి రావాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు శంఖ్ ఎయిర్- శ్రవణ్ అంటూ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతోన్న విధం కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-rammohan-naidu-36-212060.html
రెండో విడతలో భాగంగా బుధవారం యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది.
శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.
ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు భారత్కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.