Publish Date:Sep 14, 2025
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ఓ సిటీలో గ్యాస్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్ట కలిసి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నారు. ఆయన నాకంటే చిన్నవాడు నాకంటే ముందు నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు అని వాఖ్యనించాడు.
ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడారూ. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నేను భద్రకాళి గుడిలో ధర్మకర్తలను నియమించుకునే అధికారం లేదా అని అన్నారు. అధిష్టానం చెప్పిన వారికి భద్రకాళి దేవాలయం ధర్మకర్తగా నియమించామని అన్నారు. నాపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్లాడారు. భద్రకాళి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది అని మంత్రి కొండ సురేఖ మాట్లాడారు.
మంత్రి కొండ సురేఖ వాక్యాల పైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. పుటోకో పార్టీ మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యే వాడిని అని ఘాటుగా విమర్శించారు. కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను కాబట్టి ప్రజలు గెలిపించాలని అన్నారు. పుటకో పార్టీ తిరిగే ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు..మంత్రి కొండ సురేఖకు ఇస్తున్న గౌరవంని కాపాడుకోవాలని అన్నారు. ఆమె మహిళా కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నాను అని విమర్శించారు. నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని తీవ్రంగా మండి పడ్డారు.
15 ఏళ్లుగా వరంగల్ ఈస్ట్ కు రెండు డైరెక్టర్లు పదవులు ఇచ్చి మిగతావి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చారు. అలాగే నేను కూడా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి రెండు వెస్ట్ నియోజకవర్గానికి 5 పరకాల,వర్ధన్నపేట, హుస్నాబాద్ కు ఒక్కొక్క డైరెక్టర్ల చొప్పున ఇవ్వాలని సూచించాను తప్ప అని అన్నారు. నా నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-konda-surekha-39-206155.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.