తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తాను దృష్టిపెట్టిన, చేపట్టిన అన్ని అంశాలలోనూ అద్భుత ఫలితాలు రాబడుతున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే తనకంటూ ఓ బెంచ్ మార్క్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లోకేష్.. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా అద్భుత విజయాన్ని సాధించారు. గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాలలో సక్సెస్ శాతం లోకేష్ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సాధించిన విజయానికి అద్దం పట్టింది.
2024లోతెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతలు చేపట్టారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఐటీ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి శాఖలనూ పర్యవేక్షిస్తూ.. ఆ దిశగా అనితరసాధ్యమన్న విజయాలను సాధిస్తూనే.. విద్యా శాఖపై కూడా లోకేస్ తనదైన ముద్ర వేశారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి ఉత్తీర్ణత గణనీయంగా పెరగడం విశేషం. విద్యాశాఖలో లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన అడుగులు ఈ విజయానికి ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,18,131 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 5,26,954 మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా బాలికలు 87.90 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
అయితే ఈ అద్భుత ఫలితాలు రావడం వెనుక మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి ఉంది. మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్లు నిర్వహించడం.. తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరులో కూడా గణనీయమైన మార్పు తీసుకువచ్చారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం లోకేష్ పర్యవేక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. మిగిలిన చోట్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
రాష్ట్ర ప్రగతికి పెట్టుబడుల సాధన ఎంత ముఖ్యమో, విద్యార్థుల విజయం అంతకంటే ముఖ్యమని లోకేష్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ టీమ్ను అభినందించారు. విద్యాశాఖలో సాంకేతికతను జోడించడం.. ఎప్పటికప్పుడు డేటా ఆధారిత పర్యవేక్షణ చేయడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. టెన్త్ ఫలితాలు ఏపీ విద్యారంగంలో లోకేష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపించేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-elevates-educational-standards-through-action-plan-36-218702.html
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది.
Publish Date:Apr 30, 2026
ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వేగాన్ని తెచ్చాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ (19 బంతుల్లో 39) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్-ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు.