మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

Publish Date:Oct 18, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.  

కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం లేని సమస్యను సృష్టించి, రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మరో ప్రాంతీయ వాదానికి తెర తీసే కుట్ర చేస్తున్నారా? అనే సందేహం వచ్చేలా, ప్రభుత్వ చర్యలుతున్నాయి. అఫ్కోర్స్  ప్రభుత్వ నిర్ణయం వెనక అస్మదీయుల ఆర్థిక ప్రయోజానాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  అందుకే  వైసీపీ విశాఖలో జేఏసీ పేరున గర్జన సభ నిర్వహించింది. నిజమే  ఏ పేరున జరిగినా అది వైసీపీ స్పాన్సర్డ్ షో, కిరాయి ఆందోళన అనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అస్మదీయులు వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే  వైసీపీ రాజకీయ వ్యాపార గర్జన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. విజయసాయి రెడ్డి ఇతర వైసీపీ నేతలపై వస్తున్న భూదందా ఆరోపణలను పరిగణననలోకి తీసుకుంటే, వికేంద్రీకరణ మంత్రం అసలు రహస్యం ఏమిటో అందరికీ అర్థమవుతుంది. 

అందుకే  మంత్రులు  విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని గర్జిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్నారు. మరో వైపు మూడు రాజధానులు వద్దు, అమరావతినే ఏకైక రాజధానిగా కొనాసాగించాలి కోరుతూ  రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు వ్యతిరేకంగానే వైసీపీ మహా గర్జన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని మంత్రులు శపథం చేశారు.

అంటే  వికేంద్రీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.   అయితే  రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల స్టాండ్ ఏమిటి, ప్రజల అభిమతం ఏమిటి అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు అమరావతి ఏకైక రాజధానికే  ఓటేశారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అంటున్నారు. చివరకు రాష్ట్రంలో సున్నాఅయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా  అమరావతికే ఓటేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని అంటోంది.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గోడ మీది పిల్లి వాటంగా ఎటూ తేల్చకుండా  అసలు కేంద్రానికి సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అధికార వైసేపీ వికేంద్రీకరణ పేరిట సాగిస్తున్నఅరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాఖలు కనిపించడం లేదని బీజేపీ, వైసీపీ యేతర రాజకీయ పార్టీలు  అక్షేపిస్తున్నాయి. ఇదలా ఉంటే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని అన్నారు. అంతే కాదు అమరావతే రాజధాని అని ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారంటూ చెప్పుకొచ్చారు.

అందుకే అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.  ఆవు కథను మళ్ళీ వినిపించారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏది చేసినా రాజధాని మార్చే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ఇంత ఘంటాపథంగా చెపుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, మరో మంత్రి, బీజేపీ నాయకులు కానీ మూడు రాజధానుల పేరిట అరాచకానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం పై ఎందుకు చర్యలు తీసుకోదని  సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆ చెప్పేదేదో కిషన్ రెడ్డి ఒక్కరికే చెవిలో కాకుండా  నేరుగా ప్రజలకే చెపితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంతి జగన్ రెడ్డి మళ్ళీ ‘మూడు’ మాట ఎత్తరుకదా?  అని అడుగుతున్నారు.

నిజానికి, కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నట్లు చూస్తున్నది కాబట్టే  వైసేపీ గర్జన పేరిట విశాఖలో అరాచకానికి పాల్పడిందని అంటున్నారు. రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు వైసేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. నిజానికి  రాజధాని సమస్యను పరిష్కరించవలసిన చట్టబద్ధ బాధ్యతతో పాటుగా నైతిక బాధ్యత కూడా  కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత నుంచి తప్పించుకున్నా నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని  రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వహస్తాలతో శంఖుస్థాపన చేశారు. దివ్యమైన, భవ్యమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చింది. అంతే కాదు, 2017 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజధాని రైతులకు ఆదాయ పన్ను మినహాయింపును ఇచ్చారు. అంటే, ఏ కోణం నుంచి చూసినా, రాజదాని అంశం కేంద్రం పరిధిలో లేని అంశం కాదు. కేంద్ర పరిధిలోనే ఉంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యతా కేంద్రానికి వుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మాటలతో సరి పెట్టడం కాకుండా  చేతలలో చిత్తశుద్ధి చూపాలని ఏపీ ప్రజలు అంటున్నారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ ...గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్న గురజాడ మాటలు గుర్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని!
మాథ్యూప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు
పాల‌న ఎప్పుడూ జ‌న‌రంజ‌కంగా వుండాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ల‌క్ష్యాలూ ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్ర‌జ‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌పుడు మంచి పాల‌న‌ను అందిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేయించుకోవ‌డం న‌వ్వుల‌పాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వ గ్రాఫ్‌ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డిపోతోంది. అయినా అగ్నిప‌థ్ వంటి దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల‌తో యువ త‌ను దెబ్బ‌తీయ‌డం కేవ‌లం మూర్ఖ‌పు పాల‌నే అవుతుంది. అస‌లు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తే ప‌రిస్థి తులే వున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్‌ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్‌ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్‌ నగర్‌ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది.
దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.
స‌మీర్ వాంఖ‌డే. ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి. డ్ర‌గ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచీ.. దేశ‌వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆర్య‌న్‌ఖాన్ కేసు నుంచి త‌ప్పించినా.. ఎన్సీపీతో, మంత్రి మాలిక్‌తో వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా, స‌మీర్ వాంఖ‌డే హిందువు కాదు ముస్లిం అంటూ ఆధారాలు సైతం చూపించారు. 
క‌దం క‌దం క‌దిపారు. అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. వారి ల‌క్ష్యం ఒక‌టే. వారి గ‌మ్యం ఒక‌టే. అమ‌రావ‌తినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించ‌డం. ఆంధ్రుల క‌ల‌ల కేపిట‌ల్‌ను మూడు ముక్క‌లు చేసే ప్ర‌య‌త్నాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విర‌మించుకోవ‌డం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దీంతో.. జ‌గ‌న్‌రెడ్డి బండ‌రాయి హృద‌యాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. క‌లియుగ వెంక‌న్న స్వామికి మొక్కుకోవ‌డానికి అమ‌రావ‌తి రైతులు దండుగా క‌దిలారు. త‌మ గోడు మిగ‌తా జిల్లాల వారికీ తెలిసేలా.. మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. స‌డ‌ల‌ని సంక‌ల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుమ‌ల బాట ప‌ట్టారు అమ‌రావ‌తి రైతులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.